News April 29, 2024

దొంగ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కారు: బాజిరెడ్డి

image

బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని నిజామాబాద్ BRS అభ్యర్థి గోవర్ధన్ అన్నారు. ఆదివారం రాత్రి మోర్తాడ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మోదీ నిరుపేదలకు పంచుతానన్న నల్లధనం ఎటుపోయిందని ప్రశ్నించారు. దొంగ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కారని, రేవంత్ రెడ్డి ఝూటాకోర్ అంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఆశీర్వదించి మెజారిటీతో తనను గెలిపించాలని అభ్యర్థించారు.

Similar News

News April 13, 2026

నిజామాబాద్: ఇంటర్ ఫలితాలపై అధికారుల ఆరా

image

నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ ఫలితాల గణాంకాలపై విద్యాశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. రాష్ట్రస్థాయి ర్యాంకింగ్స్‌లో జిల్లా వెనుకబడటం చర్చనీయాంశమైంది. ప్రథమ సంవత్సరంలో 56.64% ఉత్తీర్ణతతో 25వ స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరంలో పరిస్థితి మరింత దిగజారి 66.19% ఉత్తీర్ణతతో 29వ ర్యాంకుకు పడిపోయింది. ఎక్కడ లోపం జరిగింది.. బోధనలో మార్పు రావాలా.. విద్యావ్యవస్థలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు చేస్తున్నారు.

News April 12, 2026

BRS పై MP అర్వింద్ ధర్మపురి హాట్ కామెంట్స్

image

BRSపై MP అర్వింద్ ధర్మపురి ఆదివారం హాట్ కామెంట్స్ చేశారు. తన దృష్టిలో రాజకీయంగా కేసీఆర్ అనే లీడర్ లేరని, BRS అంతమైపోయిందన్నారు. BRS అంటే కరప్షన్, డ్రగ్స్ అని విమర్శిస్తూ వాళ్లతో BJP పొత్తు అనే అంశమే రాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక CM రేవంత్ రెడ్డి కవిత పార్టీకి ఫండింగ్ చేస్తున్నారని అందుకే కవిత కాంగ్రెస్ గురించి మాట్లాడటం లేదని ఆరోపించారు.

News April 12, 2026

BRS పై MP అర్వింద్ ధర్మపురి హాట్ కామెంట్స్

image

BRSపై MP అర్వింద్ ధర్మపురి ఆదివారం హాట్ కామెంట్స్ చేశారు. తన దృష్టిలో రాజకీయంగా కేసీఆర్ అనే లీడర్ లేరని, BRS అంతమైపోయిందన్నారు. BRS అంటే కరప్షన్, డ్రగ్స్ అని విమర్శిస్తూ వాళ్లతో BJP పొత్తు అనే అంశమే రాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక CM రేవంత్ రెడ్డి కవిత పార్టీకి ఫండింగ్ చేస్తున్నారని అందుకే కవిత కాంగ్రెస్ గురించి మాట్లాడటం లేదని ఆరోపించారు.