News March 15, 2025

దోమకొండ: సంతకం ఫోర్జరీ ఇద్దరిపై కేసు

image

గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు దోమకొండ ఎస్ఐ స్రవంతి తెలిపారు. గ్రామానికి చెందిన ఇద్దరు జీపీ సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్లు, రసీదులు క్రియేట్ చేస్తూ, గోల్డ్లోన్ నుంచి గోల్డ్ విత్ డ్రా చేశారు. మరో వ్యక్తికి పోలీసు కేసు షూరిటీ విషయంలో ప్రయత్నించారు. ఇద్దరిపై సెక్రటరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Similar News

News December 4, 2025

నేడు, రేపు భారత్‌లో పుతిన్ పర్యటన

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండ్రోజుల పర్యటనకు నేడు భారత్ రానున్నారు. రాత్రి 7గంటలకు ఢిల్లీ చేరుకొని PM మోదీ ఇచ్చే విందుకు హాజరుకానున్నారు. రేపు ఉదయం రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత మోదీ-పుతిన్ మధ్య భేటీ జరగనుంది. పుతిన్ కోసం NSG కమాండోలు, స్నైపర్స్, డ్రోన్లు, AIతో ఐదంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. 2021 తర్వాత మళ్లీ ఆయన భారత్‌కు రావడం ఇదే.

News December 4, 2025

నేడు భారీ వర్షాలు: APSDMA

image

AP: నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. బుధవారం 5PM వరకు తిరుపతి(D) తొట్టంబేడులో అత్యధికంగా 47.2మి.మీ. వర్షపాతం నమోదైందని తెలిపింది.

News December 4, 2025

ఆరుద్రలో అడ్డెడు చల్లినా పుట్టెడు పంట

image

ఆరుద్ర కార్తె అనేది వర్షాకాలం ప్రారంభంలో వ్యవసాయ పనులకు సరైన సమయం. ఈ కార్తెలో భూమిలో తగినంత తేమ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో అడ్డెడు( తక్కువ పరిమాణంలో) విత్తనాలు చల్లినా, అవి బాగా మొలకెత్తి పుట్టెడు(ఎక్కువ) పంటను ఇస్తాయని రైతుల విశ్వాసం. ఈ సామెత ఆరుద్ర కార్తెలో విత్తనాలు వేయడం, అప్పటి వర్షాలు.. పంటకు ఎంత అనుకూలంగా ఉంటాయో తెలియజేస్తుంది.