News March 15, 2025
దోమకొండ: సంతకం ఫోర్జరీ ఇద్దరిపై కేసు

గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు దోమకొండ ఎస్ఐ స్రవంతి తెలిపారు. గ్రామానికి చెందిన ఇద్దరు జీపీ సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్లు, రసీదులు క్రియేట్ చేస్తూ, గోల్డ్లోన్ నుంచి గోల్డ్ విత్ డ్రా చేశారు. మరో వ్యక్తికి పోలీసు కేసు షూరిటీ విషయంలో ప్రయత్నించారు. ఇద్దరిపై సెక్రటరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News February 23, 2026
కేయూ పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 25, 26న నిర్వహించాల్సిన పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కట్ల రాజేందర్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షల్లో నాన్-ప్రొఫెషనల్ కోర్సులు (MA, MSC, M.com)తో పాటు ప్రొఫెషనల్ కోర్సులు ఎంబీఏ, ఎంసీఏ ఉన్నాయి. ఈ పరీక్షలను మళ్లీ నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
News February 23, 2026
కేయూ పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 25, 26న నిర్వహించాల్సిన పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కట్ల రాజేందర్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షల్లో నాన్-ప్రొఫెషనల్ కోర్సులు (MA, MSC, M.com)తో పాటు ప్రొఫెషనల్ కోర్సులు ఎంబీఏ, ఎంసీఏ ఉన్నాయి. ఈ పరీక్షలను మళ్లీ నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
News February 23, 2026
ఏలూరు జిల్లా కలెక్టర్ అసహనం

ఏలూరు జిల్లాలో ఆర్డబ్ల్యూఎస్, ఐసీడీఎస్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ నిర్మాణ పనుల ప్రగతిపై కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఉన్న 45 అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, 108 ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పనులను చేపట్టాలని నిర్దేశించారు. అయితే, వీటిలో ఇంకా 22 మరుగుదొడ్లు, 44 తాగునీటి సరఫరా, వాటర్ ట్యాంకుల పనులు కనీసం ప్రారంభించకపోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.


