News March 14, 2025
దోమ: ఒకే ఈతలో రెండు దూడలు..

ఒకే ఈతలో రెండు లేగ దూడలు జన్మించిన ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలం దోర్నాలపల్లి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకన్న ఒక ఆవు ఉంది. ఆ ఆవుకు ఒక లేగ దూడను జన్మనివ్వగా మరి కొద్దిసేపటి తర్వాత మరో లేగ దూడకు జన్మనిచ్చిందని వెంకన్న తెలిపారు. తన ఆవుకు రెండు లేగ దూడలు జన్మించడంపై ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. రెండు దూడలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయని మాజీ సర్పంచ్ వెంకన్న తెలిపారు.
Similar News
News March 15, 2025
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు.. 337 మంది గైర్హాజరు

ఖమ్మం జిల్లాలో శనివారం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా అధికారులు తెలిపారు. జనరల్ కోర్సుల్లో 13,827 మందికి గాను 13,575 మంది, అలాగే ఒకేషనల్ కోర్సుల్లో 2,121 మంది విద్యార్థులకు గాను 2,036 మంది విద్యార్థులు హాజరయినట్లు చెప్పారు. రెండు కోర్సులకు గాను 337 మంది గైర్హాజరయ్యారన్నారు. అటు జిల్లాలో ఇవాళ ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.
News March 15, 2025
KMR: ఇంటర్ పరీక్షల్లో 137 మంది గైర్హాజరు

కామారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. గురువారం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ గణితం 2బీ, జంతు శాస్త్రం, చరిత్ర పరీక్ష జరిగింది. జనరల్ గ్రూప్నకు సంబంధించి 5483 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 99 మంది పరీక్షకు హాజరు కాలేదు. ఒకేషనల్ విభాగంలో 1284 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 1246 మంది పరీక్ష రాశారని కామారెడ్డి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు.
News March 15, 2025
పెద్దపల్లి: నేడు 209 మంది గైర్హాజరు

పెద్దపల్లి జిల్లాలో బుధవారం ఇంటర్మీడియట్ రెండోవ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయని జిల్లా నోడల్ అధికారి కల్పన పేర్కొన్నారు. గణితం B, జీవ శాస్త్రం, చరిత్ర పేపర్లకు పరీక్షలు జరిగాయన్నారు. 3895 విద్యార్థులకు గాను 3647 హాజరయ్యారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 248 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఈ పరీక్షల్లో జనరల్ 209 మంది, వొకేషనల్ 39మంది విద్యార్థులు హాజరు కాలేదన్నారు.