News April 2, 2025

ద్రవిడ వర్సిటీలో పీజీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో 2025-26వ సంవత్సరానికి సంబంధించి MA, M.Com, M.Scలో చేరడానికి APPGCET-2025 పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ కిరణ్ కుమార్ సూచించారు. మే 5వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. MBA/MCA కోర్సులో చేరటానికి APICET-2025 ప్రవేశ పరీక్షకు ఏప్రిల్ 9వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు cets.apsche.ap.gov.in చూడాలి.

Similar News

News April 14, 2025

చిత్తూరు: ఏడాదిలో ఒక కోటి లక్ష రూపాయాల జరిమానా

image

ఏడాది కాలంలో తాగి వాహనం నడిపిన వాహనచోదకులకు కోటి లక్ష రూపాయలు జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు తెలిపారు. 2024 ఏప్రిల్-11 నుంచి నేటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 1,01,52,500 జరిమానా విధించామన్నారు. మొదటిసారి పట్టుబడితే రూ.10 వేలు జరిమానా, 6 నెలలు జైలు శిక్ష, రెండవసారి పట్టుబడితే రూ.15 వేలు జరిమానా, 3 ఏళ్లు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

News April 13, 2025

చిత్తూరు: ఏడాదిలో ఒక కోటి లక్ష రూపాయాల జరిమానా

image

ఏడాది కాలంలో తాగి వాహనం నడిపిన వాహనచోదకులకు కోటి లక్ష రూపాయలు జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు తెలిపారు. 2024 ఏప్రిల్-11 నుంచి నేటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 1,01,52,500 జరిమానా విధించామన్నారు. మొదటిసారి పట్టుబడితే రూ.10 వేలు జరిమానా, 6 నెలలు జైలు శిక్ష, రెండవసారి పట్టుబడితే రూ.15 వేలు జరిమానా, 3 ఏళ్లు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

News April 13, 2025

పులిచెర్ల: బావిలో దిగి బాలుడి మృతి

image

బంతి కోసం బావిలోకి దిగి పైకి రాలేక దిలీప్ అనే బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన పులిచెర్ల మండలం అయ్యవారిపల్లిలో చోటుచేసుకుంది. సురేష్, లత కుమారుడైన దిలీప్ బెంగళూరులో ఉంటున్నారు. ఉగాది పండుగకు అయ్యావారిపల్లికి వచ్చారు. శనివారం సాయంత్రం అవ్వతో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. బంతి ఆడుకుంటున్న సమయంలో బంతి బావిలో పడింది. బంతి కోసం దిగిన దిలీప్ పైకి రాలేక మృతి చెందాడు. కల్లూరు ఎస్సై ఘటనా స్థలాన్ని సందర్శించారు.

error: Content is protected !!