News February 13, 2025
‘ద్రౌపది దాహం తీర్చుకున్న ప్రదేశమే భీముని కొలను’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739350784980_672-normal-WIFI.webp)
పూర్వం పాండవులు శ్రీశైలం నల్లమల అడవుల్లో తీర్థయాత్రలు చేస్తూ ద్రౌపది దాహం తీర్చుకున్న కొలనే భీముని కొలనుగా ప్రసిద్ధి చెందింది. ద్రౌపది దాహంగా ఉందని చెప్పడంతో భీముడు చుట్టుపక్కల వెతికాడు. ఎక్కడా నీళ్లు దొరకలేదు. దాలోమశ మహర్షి ఒక శిలను చూపించి, పగులగొట్టమని చెప్పాడు. గదతో ఆ శిలను భీముడు పగులగొట్టగా నీటి ధారలు కిందికి దూకాయి. భీముని కారణంగా ఏర్పడిన కొలను కావడంతో ‘భీముని కొలను‘ అనే పేరు వచ్చింది.
Similar News
News February 13, 2025
రాజాపేట: ఉరేసుకొని యువకుడి సూసైడ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739449917594_20542147-normal-WIFI.webp)
ఉరేసుకొని యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన రాజాపేట మండలంలో జరిగింది. SI అనిల్ కుమార్ తెలిపిన వివరాలు.. రఘునాథపురానికి చెందిన బిట్ల రమేశ్ పెద్ద కుమారుడు పవన్(25) గురువారం ఉదయం ఇంట్లో ఎవరులేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. ఘటనాస్థలానిక చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News February 13, 2025
లగ్జరీ కార్లతో స్టూడెంట్స్ రచ్చ.. షాకిచ్చిన పోలీసులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739445496337_695-normal-WIFI.webp)
గుజరాత్ సూరత్లోని ఓ స్కూల్కు చెందిన 12వ తరగతి విద్యార్థులు ఇటీవల ఫేర్వెల్ పార్టీకి 35 లగ్జరీ కార్లతో వచ్చి <<15425002>>హల్చల్ చేశారు<<>>. లైసెన్సు లేకుండా కారు నడపడమే కాకుండా స్టంట్లు చేస్తూ వీడియోలు తీసుకున్నారు. ఈ దృశ్యాలు వైరలవడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఆ విద్యార్థుల తల్లిదండ్రులపై కేసులు నమోదు చేశారు. 22 కార్లను సీజ్ చేశామని, మరికొన్ని కార్లను గుర్తిస్తున్నామని DCP బరోత్ వెల్లడించారు.
News February 13, 2025
ఎంఎల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739446291935_15122836-normal-WIFI.webp)
ఎంఎల్సీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల పరిశీలకులు కే.సునీత ఆదేశించారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల పీఓలను, ఏపీఓలను నియమించారా? అని అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ మాట్లాడతూ.. పీఓలకు, ఏపిఓలకు, ఇతర పోలింగ్ సిబ్బంది ఈనెల 18,24 తేదీల్లో రెండు విడతల్లో శిక్షణ అందించడానికి ఏర్పాటు చేశామన్నారు.