News December 27, 2024

ద్వారకతిరుమల: టాయ్ నోట్ల‌తో వ్యాపారిని మోసం చేసిన యువకులు

image

ద్వారకాతిరుమలలో నకిలీ కరెన్సీ వ్యవహరంలో వ్యాపారిని మోసం చేసిన ఘటన గురువారం జరిగింది. జంగారెడ్డిగూడెంకు చెందిన ఇద్దరు యువకులు సుభాష్ అనే వ్యాపారిని నగదు 2.50 లక్షలు ఇస్తే నకిలీ కరెన్సీ రూ.15 లక్షలు ఇస్తామంటూ నమ్మించారు. అసలు నోట్లను సుభాష్ ఇచ్చి యువకుల నుంచి బ్యాగ్‌ను తీసుకున్నారు. టాయ్ కరెన్సీ ఉండటంతో కంగుతున్న సుభాష్ తన బ్యాగ్‌ను లాక్కున్నాడు. ఒకరిని పోలీసులకు అప్పగించగా మరో యువకుడు పరారయ్యాడు.

Similar News

News January 25, 2025

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించి ఎమ్మెల్యే రాధాకృష్ణ 

image

సీఎం చంద్రబాబు ఫిబ్రవరి 1న తణుకులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దువ్వ గ్రామంలో పర్యటించారు. తణుకు మండలంలోని తేతలి తవ్వ గ్రామాల్లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ స్థలాలను పరిశీలించనున్నారు. ఈ క్రమంలో శనివారం ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆయా ప్రాంతాల్లో పర్యటించి సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించారు.

News January 25, 2025

నూజివీడు: లారీ డ్రైవర్‌కు జైలు శిక్ష

image

ఓ లారీ డ్రైవర్‌కు మూడు నెలల జైలు శిక్ష, రూ. 200 జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మెజిస్ట్రేట్ శుక్రవారం తీర్పు వెలువరించారు. 2020లో బాపులపాడుకు చెందిన లెనిన్ ఆయన కుమార్తె శ్రీదేవీ బైకుపై వెళుతుండగా వారిని లారీ ఢీ కొట్టింది. దీంతో వారు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. దీనిపై అప్పట్లో హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో లారీ డ్రైవర్ ప్రభాకర్‌కు శిక్ష పడింది.

News January 25, 2025

పశువధను నిలిపివేయాలని కలెక్టర్‌కి మహిళలు విజ్ఞప్తి

image

తణుకు మండలం తేతలిలో లేహం ఫుడ్స్ పేరుతో నిర్వహిస్తున్న పశువధ కర్మాగారాన్ని మూసివేయాలని కోరుతూ స్థానిక మహిళలు జిల్లా కలెక్టర్ నాగరాణికు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రాత్రి తణుకులోని రామకృష్ణ సేవా సమితి భవనంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కలెక్టర్ నాగరాణిను కలిసిన వారు తణుకులో పశు వధ కర్మగారం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.