News January 29, 2025
ద్వారకాతిరుమల: 5 గంటల వరకే విద్యుత్ సరఫరా

భీమడోలు 220KV విద్యుత్ సబ్ స్టేషన్లో కండక్టర్ మార్పు, మరమ్మతుల కారణంగా ఈనెల 31న వ్యవసాయం, తాగునీరు సర్వీసులకు ఉదయం 5 గంటల వరకు మాత్రమే కరెంట్ సరఫరా ఇస్తామని ఆ శాఖ ఈఈ అంబేద్కర్ తెలిపారు. 220KV భీమడోలు సబ్ స్టేషన్ విద్యుత్ కేంద్రం పరిధిలోని భీమడోలు, ద్వారకాతిరుమల, ఉంగుటూరు, పెదవేగి, దెందులూరు, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాల వ్యవసాయ, ఇతర విద్యుత్ వినియోగదారులు గమనించి, తమకు సహకరించాలని కోరారు.
Similar News
News November 16, 2025
BREAKING: భారత్ ఓటమి

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో భారత్కు ఊహించని షాక్ ఎదురైంది. 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమి పాలైంది. టీమ్ ఇండియా 93 పరుగులకే పరిమితమైంది. దీంతో RSA 30 పరుగుల తేడాతో గెలిచింది. సుందర్ 31, అక్షర్ 26, జడేజా 16 రన్స్ చేశారు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. మెడనొప్పితో గిల్ సెకండ్ ఇన్నింగ్సులో బ్యాటింగ్కు రాలేదు. SA బౌలర్లలో హార్మర్ 4, జాన్సెన్ 3 వికెట్లతో సత్తా చాటారు.
News November 16, 2025
HYD: బిర్సా ముండా జయంతి సందర్భంగా ర్యాలీ

భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సావిత్రితో కలిసి ట్యాంక్ బండ్ వద్ద స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వివేకానంద విగ్రహం నుంచి కొమురం భీమ్ విగ్రహం వరకు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కుల కోసం భగవాన్ బిర్సా ముండా చూపిన ధైర్యం ఎనలేనిదన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొన్నారు.
News November 16, 2025
HYD: బిర్సా ముండా జయంతి సందర్భంగా ర్యాలీ

భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సావిత్రితో కలిసి ట్యాంక్ బండ్ వద్ద స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వివేకానంద విగ్రహం నుంచి కొమురం భీమ్ విగ్రహం వరకు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కుల కోసం భగవాన్ బిర్సా ముండా చూపిన ధైర్యం ఎనలేనిదన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొన్నారు.


