News March 30, 2025
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి: కలెక్టర్

జిల్లాలో బైక్ రైడర్లు తప్పకుండా హెల్మెట్ వాడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను శనివారం ఆదేశించారు. జిల్లాలో ఆశించిన స్థాయిలో బైక్ రైడర్లు హెల్మెట్ వినియోగించకపోవడం ఆందోళన కరమన్నారు. స్థానిక కలెక్టరేట్లో ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Similar News
News September 20, 2025
సీఎం నిర్ణయంతో ఉల్లి రైతులకు భారీ ఊరట: మంత్రి భరత్

కర్నూలు జిల్లా ఉల్లి రైతులను ఆదుకునేందుకు హెక్టారుకు రూ.50వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ప్రకటంచడంపై మంత్రి టీజీ భరత్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు మంత్రి కృతజ్నతలు తెలిపారు. ధరల పతనంతో నష్టపోతున్న రైతులకు ఇది ఊరటనిచ్చే నిర్ణయమని అన్నారు. ఉల్లి రైతుల ఇబ్బందులపై సీఎం చంద్రబాబు తొలి నుంచి సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
News September 20, 2025
NLG: పండుగల వేళ.. ధరల షాక్

జిల్లాలో పండుగల ముందు నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. రోజురోజుకు నూనెలు, బియ్యం, కూరగాయల ధరలు పోటాపోటీగా పెరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ మొదలు కానుంది. ఆ తర్వాత పది రోజుల్లోనే దసరా పండుగ ఉంది. ఈ సమయంలో ధరల పెరుగుదల సామాన్య జనంలో ఆందోళన రేపుతున్నది. పల్లీ నూనె రూ.190 వరకు విక్రయిస్తున్నారు. కందిపప్పు KG రూ.220కు పైగానే ఉన్నది.
News September 20, 2025
YSR తాడిగడప మున్సిపాలిటీ పేరు మార్పు!

తాడిగడప మున్సిపాలిటీకి వైఎస్ఆర్ పేరును మారుస్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు ఆమోదం తెలిపారు. వైఎస్ఆర్ తాడిగడపకు బదులుగా తాడిగడప మున్సిపాలిటీగా చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.