News March 15, 2025

ధన్వాడ: చిరుత దాడిలో దూడ మృతి.!

image

చిరుత దాడిలో లేగదూడ మృతి చెందిన ఘటన ధన్వాడ మండలంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలానికి చెందిన రైతు చెట్టుకింది కథలప్ప పొలంలో శుక్రవారం రాత్రి లేగదూడపై చిరుత దాడి చేయడంతో మృతి చెందింది. సుమారు రూ.60 వేలు నష్టం వాటిలినట్లు రైతు తెలిపారు. శనివారం ఉదయం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మల్లేశ్ ఘటన ప్రదేశాన్ని పరిశీలించి చిరుత దాడి జరిగినట్లు నిర్ధారించారు.

Similar News

News November 13, 2025

అల్ ఇండియా అథ్లెటిక్స్ పోటీలకు రంపచోడవరం విద్యార్థి

image

రంపచోడవరం డిగ్రీ కళాశాల విద్యార్థులు నన్నయ యూనివర్శిటీ నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబర్చి బంగారు పతకాలు గెలుపొందినట్లు ప్రిన్సిపల్ డాకే వసుధ తెలిపారు. బెంగళూరులో నిర్వహించే అల్ ఇండియా అథ్లెటిక్స్ పోటీలకు జి. ప్రవీణ్ సెలెక్టైనట్లు వివరించారు. పతకాలు సాధించిన విద్యార్థులకు వైస్ ప్రిన్సిపల్ రవికుమార్, పీడీ ప్రభాకర్ రావు, అధ్యాపకులు అభినందించారు.

News November 13, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 13, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.05 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.20 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 13, 2025

పాకిస్థాన్‌తో సిరీస్ కొనసాగుతుంది: శ్రీలంక

image

ఇస్లామాబాద్‌లో పేలుడు నేపథ్యంలో పలువురు శ్రీలంక ప్లేయర్లు పాకిస్థాన్ వీడుతారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్ కొనసాగుతుందని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటన జారీ చేసింది. ప్లేయర్లు, సిబ్బందికి తగిన భద్రతను పాక్ కల్పిస్తుందని స్పష్టం చేసింది. ఎవరైనా జట్టును వీడితే వారి స్థానంలో ఇతర ప్లేయర్లను రీప్లేస్ చేస్తామని పేర్కొంది. ఇవాళ పాక్-శ్రీలంక మధ్య రెండో వన్డే జరగనుంది.