News March 15, 2025

ధన్వాడ: చిరుత దాడిలో దూడ మృతి.!

image

చిరుత దాడిలో లేగదూడ మృతి చెందిన ఘటన NRPT జిల్లా ధన్వాడ మండలంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలానికి చెందిన రైతు చెట్టుకింది కథలప్ప పొలంలో శుక్రవారం రాత్రి లేగదూడపై చిరుత దాడి చేయడంతో మృతి చెందింది. సుమారు రూ.60 వేలు నష్టం వాటిలినట్లు రైతు తెలిపారు. శనివారం ఉదయం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మల్లేశ్ ఘటన ప్రదేశాన్ని పరిశీలించి చిరుత దాడి జరిగినట్లు నిర్ధారించారు.

Similar News

News December 19, 2025

పాలమూరు: ఈనెల 21న.. U-19 కరాటే ఎంపికలు

image

మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-19 బాల, బాలికలకు కరాటే ఎంపికలను ఈనెల 21న మహబూబ్ నగర్ లోని డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్స్ నిర్వహిస్తున్నట్లు SGF కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఆసక్తిగల జిల్లా క్రీడాకారులు ఒరిజినల్ టెన్త్ మెమో, బోనఫైడ్, ఆధార్ కార్డు పత్రాలు తీసుకొని ఉదయం 9 గంటలలోపు రిపోర్ట్ చేయాలన్నారు.
SHARE IT

News December 19, 2025

MBNR: నేడు సౌత్ జోన్ టేబుల్ టెన్నిస్ ఎంపికలు

image

మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు వర్సిటీ నుంచి సౌత్ జోన్ ఆలిండియా టేబుల్ టెన్నిస్ పోటీల్లో పాల్గొనే జట్ల ఎంపికలను శుక్రవారం నిర్వహించనున్నట్లు వర్సిటీ పీడీ డా. వై.శ్రీనివాసులు ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఎంపికలు పాలమూరు యూనివర్సిటీలోని ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉంటాయన్నారు. ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య జిఎన్ శ్రీనివాస్ హాజరవుతున్నట్లు తెలిపారు.

News December 19, 2025

MBNR: T-20 క్రికెట్ లీగ్.. మొత్తం 5 జట్లు

image

మహబూబ్‌నగర్‌లో ఈనెల 22 నుంచి జి.వెంకటస్వామి మెమోరియల్ ఉమ్మడి జిల్లా టీ-20 క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఈ లీగ్‌లో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట జట్లు పాల్గొంటాయని, ప్రతి జట్టు నాలుగేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుందన్నారు. ప్రతి జట్టులో 15 మంది క్రీడాకారులను ఇప్పటికే ఎంపికలు చేశామన్నారు.