News February 10, 2025
ధన్వాడ: బీజేపీకి సీనియర్ నాయకుడు రాజీనామా

ధన్వాడ మండలం బీజేపీలో అంతర్గత విభేదాలతో సీనియర్ నాయకుడు ఎర్రగుంట్ల విజయకుమార్ సోమవారం బీజేపీకి రాజీనామ చేశారు. పార్టీలో సీనియర్ అయినప్పటికీ తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మండల పార్టీ అధ్యక్ష పదవికి పోటీపడిన విజయ్ కుమార్ను కాదని శివరాజ్ సాగర్కు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఆయనతో పాటు శ్రీనివాసులు మరికొందరు పార్టీని వీడారు.
Similar News
News November 28, 2025
128 మంది మృతి.. కారణమిదే!

హాంగ్కాంగ్లోని అపార్ట్మెంటలో ఘోర <<18395020>>అగ్నిప్రమాదం<<>> పెను విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు 128 మంది మరణించగా 79 మంది గాయపడ్డారు. వందల ఫైర్ ఇంజిన్లు, 2,300 మంది ఫైర్ ఫైటర్లు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో ఆయా అపార్ట్మెంట్లలో ఫైర్ అలారాలు పనిచేయకపోవడంతో నివాసితులు మంటలను గుర్తించలేకపోయినట్లు అధికారులు తెలిపారు. 128మంది సజీవదహనానికి ఇదే కారణమని భావిస్తున్నారు.
News November 28, 2025
HYD: విశిష్ట రంగస్థల పురస్కారం గ్రహీత.. ప్రొఫైల్ ఇదే!

సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావుకు 2026 సంవత్సరానికి గాను విశిష్ట రంగస్థల పురస్కారం వరించింది. 2001లో K2 నాటికకు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు, 2020లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా, తెలుగులో ‘ప్రతాప రుద్రమ’ నాటకానికి దర్శకత్వం వహించిన తొలి తెలుగువాడిగా ఘనత సాధించారు. ఆధునిక తెలుగు నాటకరంగంలో జాతీయ, అంతర్జాతీయ వేదికలల్లో ఎన్నో ప్రదర్శనలు చేసి సందర్శించారు.
News November 28, 2025
SUలో 14 ఏళ్ల తర్వాత తెలుగు PHDకి పర్మిషన్

శాతవాహన వర్సిటీలో 14 ఏళ్ల తర్వాత తెలుగు పీహెచ్డీకి అనుమతి లభించింది. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ వీసీ ప్రొ.ఉమేష్ కుమార్ను జేఏసీ ఛైర్మన్ చెన్నమల్ల చైతన్య, తెలుగు విభాగం ఆచార్యులు, విద్యార్థులు గజమాలతో ఘనంగా సత్కరించారు. నెట్, సెట్ సాధించిన విద్యార్థులకు ఇది గొప్ప అవకాశమని చైతన్య పేర్కొనగా, వర్సిటీ అభివృద్ధే తన లక్ష్యమని వీసీ తెలిపారు. కార్యక్రమంలో డా.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


