News April 6, 2025

ధన్వాడ: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

ధన్వాడ మండల కేంద్రంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ గాయపడిన ఘటన తెలిసిందే. ఆ మహిళ చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందింది. స్థానికుల వివరాలు.. మరికల్ మండలానికి చెందిన అంజమ్మ తన కుమారునితో కలిసి బైక్‌పై వస్తుండగా మోడల్ స్కూల్ దగ్గర ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. మహబూబ్నగర్లో చికిత్స పొందుతూ అంజమ్మ ఆదివారం మృతి చెందిందని ధన్వాడ ఎస్సై రమేశ్ తెలిపారు.

Similar News

News December 1, 2025

మక్తల్ ప్రజా విజయోత్సవాలు ముఖ్యాంశాలు

image

✓మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి వెంటనే ఆమోదం.
✓5 వేల కోట్లుతో లక్ష ఎకరాలకు నీరందించనున్న ప్రాజెక్ట్‌పై మంత్రి శ్రీహరి ధన్యవాదాలు.
✓మక్తల్‌కు 50 కోట్లతో హాస్పిటల్ ఆమోదం.
✓మక్తల్–నారాయణపేట మధ్య 210 కోట్లతో నాలుగు లైన్ల రోడ్ మంజూరు.
✓పర్యాటక, దేవాలయాల అభివృద్ధికి జూపల్లి కృష్ణారావు నిధుల కేటాయింపు.
✓మక్తల్ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకురావాలని మంత్రి శ్రీహరి హామీ.

News December 1, 2025

మాక్ అసెంబ్లీలో పాల్గొన్న విద్యార్థులు సత్కరించిన కలెక్టర్

image

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న నిర్వహించిన మాక్ అసెంబ్లీలో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ భీమవరం కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మాక్ అసెంబ్లీలో ప్రతిభ చూపిన విద్యార్థులు భవిష్యత్తులో నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

News December 1, 2025

గద్వాల: ఎట్టకేలకు హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన

image

గద్వాల మండలం కొత్తపల్లి నుంచి ఆత్మకూరు వరకు కృష్ణా నదిలో రూ.121 కోట్లతో హైలెవెల్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు సోమవారం భూమి పూజ చేశారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు సమీపంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని సీఎం పేర్కొన్నారు.