News June 24, 2024

ధరణి పెండింగ్ ఫైల్స్‌లో వేగం పెంచాలి: అదనపు కలెక్టర్

image

ధరణి పెండింగ్ ఫైల్స్‌ పరిష్కారం వేగవంతం చేయాలని ఖమ్మం అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. కొనిజర్ల తహసీల్దార్ కార్యాలయం తనిఖీ చేసి, పెండింగ్ ధరణి, రిజిస్ట్రేషన్ స్లాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఫిజికల్ ఫైల్స్‌ ఆన్లైన్, అప్లోడ్ ప్రక్రియలో వేగం పెంచాలన్నారు. రిజిస్ట్రేషన్ స్లాట్ల విషయమై దరఖాస్తుదారులకు సమాచారం ఇవ్వాలన్నారు.

Similar News

News December 10, 2025

మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

image

డిసెంబర్ 11న జరిగే మొదటి దశ పంచాయతీ ఎన్నికల కోసం పటిష్ఠ ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. జిల్లాలోని 7మండలాల పరిధిలో 172పంచాయతీలు, 1,740వార్డులలో పోలింగ్ జరుగుతుంది. అనంతరం అదే కేంద్రాల్లో ఫలితాలు వెల్లడిస్తారు. మొత్తం 2,41,137మంది ఓటర్లు ఉండగా, 20 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 360క్రిటికల్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, 162సెన్సిటివ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు.

News December 10, 2025

‘పోలింగ్ రోజున వేతనముతో కూడిన సెలవు’

image

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ లేబర్ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి మంగళవారం కీలక ప్రకటన విడుదల చేశారు. SEC, జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు ఎన్నికలు జరుగుతున్న పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేట్ ఆఫీసులు, షాపులు, వాణిజ్య సంస్థలు, ఇతర పరిశ్రమల యజమానులు తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులకు ఏ విధంగానూ జీతం కట్ చేయవద్దన్నారు.

News December 10, 2025

‘పోలింగ్ రోజున వేతనముతో కూడిన సెలవు’

image

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ లేబర్ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి మంగళవారం కీలక ప్రకటన విడుదల చేశారు. SEC, జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు ఎన్నికలు జరుగుతున్న పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేట్ ఆఫీసులు, షాపులు, వాణిజ్య సంస్థలు, ఇతర పరిశ్రమల యజమానులు తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులకు ఏ విధంగానూ జీతం కట్ చేయవద్దన్నారు.