News June 30, 2024

ధరణి పెండింగ్ సమస్యలను త్వరలో పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్

image

ధరణి పెండింగ్ సమస్యలను త్వరలో పరిష్కస్తామని, క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామని నల్గొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, సీసీఎల్ఎ ఇన్‌ఛార్జి నవీన్ మిట్టల్‌కు తెలిపారు. నల్గొండ జిల్లా కలెక్టరేట్లో ధరణి సమస్యలు, పరిష్కారాలపై రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సిసిఎల్ఎ ఇంచార్జ్ నవీన్ మిట్టల్ తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

Similar News

News September 20, 2024

శ్రీశైలం జలాశయం సొరంగాన్ని సందర్శించిన మంత్రుల బృందం

image

శ్రీశైలం జలాశయం నుండి 40 కి.మీ భూగర్భ అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ దిగువన నిర్మించబడిన సొరంగాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ సుఖేందర్ రెడ్డిలు సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీశైలం డెడ్ స్టోరేజీ నుంచి 30 టీఎంసీల నీటిని ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీసుకొస్తుందని తెలిపారు.

News September 20, 2024

సూర్యాపేట: గణపతి లడ్డూను దక్కించుకున్న ముస్లిం దంపతులు

image

సూర్యాపేట జిల్లా యాతవాకిళ్లలో ముస్లిం దంపతులు షేక్ దస్తగిరి – సైదాబీ మత సామరస్యం చాటుకున్నారు. శ్రీ ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలోని శ్రీ గణేశ్ మహారాజ్ లడ్డూని రూ.29,000 వేలకు కైవసం చేసుకున్నారు. భారీ ఊరిగేంపుతో లడ్డూను దస్తగిరి ఇంటికి తరలించారు. దస్తగిరి – సైదాబీ దంపతులను పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఛత్రపతి శివాజీ యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

News September 19, 2024

దేవరకొండ: ముగ్గురు విద్యార్థుల ఆచూకీ లభ్యం

image

నల్గొండ జిల్లా దేవరకొండ మైనార్టీ గురుకుల పాఠశాలలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థుల ఆచూకీ లభ్యమైనట్లు సీఐ నరసింహులు తెలిపారు. పాఠశాల గోడ దూకి పారిపోయిన విద్యార్థులు బుధవారం అర్ధరాత్రి చింతపల్లి మండలం మాల్ పట్టణంలో పోలీసులకు దొరికినట్టు తెలిపారు. విద్యార్థులను దేవరకొండ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.