News February 12, 2025

ధరూర్: ఏసీబీ కోర్టులో ఎస్‌ఐ.!

image

ఏసీబీకి చిక్కిన ధరూర్ ఎస్సై వేణుగోపాల్ గౌడ్‌పై రిమాండ్ అనంతరం పోలీస్ శాఖ పరమైన చర్యలు తీసుకోనుంది. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ గౌడ్ మంగళవారం ఓ కేసు వ్యవహారంలో రూ.30వేలు లంచం తీసుకుంటూ డ్రైవర్‌తో సహా ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు నాంపల్లి ఏసీబీ కోర్టులో ఏసీబీ అధికారులు ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్‌ను, డ్రైవర్‌ను హాజరుపరిచారు.

Similar News

News January 5, 2026

రూ.5 కోట్లతో తీస్తే రూ.50 కోట్ల కలెక్షన్లు

image

దింజిత్ అయ్యతన్ దర్శకత్వంలో రూ.5 కోట్లతో తెరకెక్కిన మలయాళ మూవీ ‘ఎకో(eko)’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టి 378% లాభాలతో మలయాళంలోనే 2025లో అత్యధిక ప్రాఫిట్ వచ్చిన చిత్రంగా నిలిచింది. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో సందీప్ ప్రదీప్, సౌరభ్ సచ్‌దేవ్, బియానా మోమిన్, వినీత్ కీలక పాత్రల్లో నటించారు. నెట్‌ఫ్లిక్స్‌లో(తెలుగు) స్ట్రీమింగ్ అవుతోంది.

News January 5, 2026

కృష్ణా: ఏడాది తొలి వారంలో 417 అర్జీలు

image

మచిలీపట్నంలో కలెక్టర్ బాలాజీ జిల్లా అధికారులతో కలిసి PGRS సోమవారం నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. కలెక్టర్ బాలాజీ స్పందిస్తూ.. అన్ని అర్జీలను 72 గంటల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. PGRS ద్వారా ఇప్పటివరకు 95% అర్జీలు పరిష్కరించినట్లు తెలిపారు. ఈ ఏడాది తొలి వారంలో 417 అర్జీలు అందగా సమస్యల పరిష్కారాన్ని ఆన్‌లైన్‌లో సంక్షిప్త సందేశాల ద్వారా తెలియజేస్తున్నట్లు చెప్పారు.

News January 5, 2026

BRS అతి తెలివితో తెలంగాణకు భారీ నష్టం: ఉత్తమ్

image

TG: పోలవరం-నల్లమల సాగర్‌ను తాము అన్ని ఫోరమ్‌లలో వ్యతిరేకిస్తున్నామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ఇంటర్ స్టేట్ రూల్స్‌కు వ్యతిరేకమని GRMBకి లేఖ రాసినట్లు తెలిపారు. ఈ కేసులో స్టే ఇవ్వాలని ఈ నెల <<18768178>>12న<<>> కోర్టును కోరుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిందన్నారు. కృష్ణా-గోదావరి జలాల్లో BRS అతి తెలివితో తెలంగాణకు భారీ నష్టం చేసిందని విమర్శించారు.