News April 16, 2025
ధరూర్ తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

ప్రజలకు అందుబాటులో ఉండి, వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ధరూర్ మండల తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, రెవెన్యూ దరఖాస్తులను ఆన్లైన్లో పరిశీలించి, సంబంధిత అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కుల, ఆదాయ, ఓబీసీ, రెసిడెన్స్ సర్టిఫికెట్లు జారీ కోసం వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.
Similar News
News November 28, 2025
వనపర్తి: నామినేషన్లలో పొరపాట్లు వద్దు: కలెక్టర్

వనపర్తి జిల్లాలో నామినేషన్ల ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరగకుండా ఎన్నికల నిబంధనలను జాగ్రత్తగా అమలు చేయాలని రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. రెండో, మూడో దశ ఎన్నికల నామినేషన్ల స్వీకరణపై శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, ప్రతి ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 28, 2025
సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.


