News January 29, 2025

ధర్పల్లి: మిషన్ భగీరథ ఏఈఈ ఆత్మహత్య

image

ధర్పల్లిలో మిషన్ భగీరథ AEEగా విధులు నిర్వహిస్తున్న సాయి చరణ్(25) డిచ్‌పల్లి మండలం నడిపల్లి శివారులో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన ఆయన మూడు నెలల కిందట మొదటి పోస్టింగ్‌లో ధర్పల్లిలో విధుల్లో చేరారు. NZB సుభాష్ నగర్‌లో ఉంటున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 1, 2025

NZB: కలెక్టర్, సీపీతో ఎస్టీ, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ భేటీ

image

రాష్ట్ర షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగల కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం NZB కలెక్టరేట్‌లో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఇతర అధికారులతో భేటీ అయ్యారు. పోలీసు, రెవెన్యూ అధికారులు, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, సంక్షేమ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులతో అట్రాసిటీ కేసుల్లో పురోగతి, ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. సమస్యలపై బాధితుల నుంచి విజ్ఞాప్తులు స్వీకరించారు.

News November 1, 2025

UPDATE: ఘటనా స్థలాన్ని పరిశీలించిన NZB CP

image

నవీపేట్ మండలం ఫకీరాబాద్ -మిట్టాపల్లి రహదారిలో ఓ మహిళను <<18166463>>వివస్త్రగా చేసి దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే.<<>> విషయం తెలుసుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. డాగ్ స్క్వాడ్‌తో పరిశీలన చేయించారు. నవీపేట్ మండలంలో మహిళల హత్యలు వెలుగు చూస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వారం వ్యవధిలో ఇది రెండవ హత్య కావడం గమనార్హం.

News November 1, 2025

వర్ని: బాలికపై లైంగిక దాడి.. యువకుడిపై పోక్సో కేసు

image

వర్నిమండలంలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై గణేష్ (24)అనే యువకుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడగా బాలిక గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రెండు రోజుల క్రితం ఆమెకు కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి బాలిక గర్భం దాల్చినట్లు నిర్ధారించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వర్ని SI మహేష్ తెలిపారు.