News January 29, 2025

ధర్పల్లి: మిషన్ భగీరథ ఏఈఈ ఆత్మహత్య

image

ధర్పల్లిలో మిషన్ భగీరథ AEEగా విధులు నిర్వహిస్తున్న సాయి చరణ్(25) డిచ్‌పల్లి మండలం నడిపల్లి శివారులో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన ఆయన మూడు నెలల కిందట మొదటి పోస్టింగ్‌లో ధర్పల్లిలో విధుల్లో చేరారు. NZB సుభాష్ నగర్‌లో ఉంటున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 14, 2025

NZB: పసుపు బోర్డు ఎక్కడుందో నాకే తెలియదు: AMC ఛైర్మన్

image

జిల్లాలో ఏర్పాటు చేశామని చెబుతున్న పసుపు బోర్డు ఎక్కడ ఉంది నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అయిన తనకే తెలియదని, ఇంకా రైతులకు ఎలా తెలుస్తుందని ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి అన్నారు. గురువారం డీసీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పసుపు బోర్డు అని ప్రైవేట్ హోటల్‌లో దానిని ప్రారంభించారని అందుకు రైతులను, మార్కెట్ కమిటీలను పిలువకుండా కేవలం పార్టీ కార్యకర్తలతో కార్యక్రమం చేయించారని విమర్శించారు.

News March 13, 2025

NZB: జిల్లా వ్యాప్తంగా నిరసనలు, దిష్టిబొమ్మల దగ్ధం

image

జిల్లా వ్యాప్తంగా నిరసనలు, దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమాలు శుక్రవరాం నిర్వహిస్తున్నామని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. BRS ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని బడ్జెట్ సమావేశాల సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

News March 13, 2025

NZB: 651 మంది విద్యార్థుల గైర్హాజరు

image

నిజామాబాద్ జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ-1 పరీక్షకు మొత్తం 651 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని నిజామాబాద్ DIEO రవికుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 18,197 మంది విద్యార్థులకు 17,546 మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని రవి కుమార్ వివరించారు.

error: Content is protected !!