News March 16, 2025

ధర్పల్లి: హోన్నాజీపేట్‌లో బీర్ సీసాతో కొట్టి చంపారు..!

image

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హోన్నాజిపేట్ గ్రామంలో పాలెం నడిపి మల్లయ్య (55) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడిని భార్య, కొడుకు కలిసి శనివారం రాత్రి చంపేశారని అనుమానిస్తున్నారు. మల్లయ్య తలపై కొడుకు మధు బీరు సీసాతో దాడి చేసి గొంతు నులిమి హత్య చేయగా అందుకు మల్లయ్య భార్య లక్ష్మి సహకరించినట్లు తెలిసింది. ఈ విషయం ఆదివారం ఉదయం వెలుగు చూసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 18, 2025

NLG: జిల్లాలో పుంజుకున్న ఎల్ఆర్ఎస్ ప్రక్రియ

image

నల్గొండ జిల్లా వ్యాప్తంగా లేఅవుట్ రెగ్యులర్ రెగ్యులేషన్ (ఎల్ఆర్ఎస్) ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించినందుకు గత ప్రభుత్వం 2020 ఆగస్టులో ఎల్ఆర్ఎస్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలో ప్రజల నుంచి స్పందన వచ్చింది. మార్చి 31 లోగా రెగ్యులరైజ్ చేసుకుంటే ఫీజులు 25% రాయితీ ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతమైంది.

News March 18, 2025

7 సెకన్లలోనే గుండె జబ్బుల నిర్ధారణ.. NRIకి సీఎం ప్రశంసలు

image

AP: గుండె జబ్బులను నిర్ధారించే సిర్కాడియావీ యాప్‌ను రూపొందించిన NRI విద్యార్థి సిద్ధార్థ్(14) CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్‌ను కలిశారు. యాప్ గురించి అడిగి తెలుసుకున్న సీఎం విద్యార్థిని ప్రశంసించారు. వైద్యరంగంలో మరిన్ని ఆవిష్కరణలు చేయాలని ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ యాప్‌ను సిద్ధార్థ్ ఏఐ సాయంతో రూపొందించారు. దీంతో ఇప్పటికే గుంటూరు ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించారు.

News March 18, 2025

NLG: జూనియర్ కాలేజీల్లో బోధన కష్టాలు గట్టెక్కినట్టే!

image

నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్ల కొరత తీరనున్నది. గత 13 ఏళ్లుగా పూర్తిస్థాయి అధ్యాపకులు లేక జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధన అంతంత మాత్రంగానే సాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నియామకాలు చేపట్టడంతో జిల్లాకు సుమారు 50 మంది వరకు కొత్త అధ్యాపకులు రానున్నట్లు సమాచారం. దీంతో అధ్యాపకుల కొరత తీరనుండడంతో బోధన కష్టాలు ఇక గట్టెక్కనున్నాయి.

error: Content is protected !!