News March 16, 2025
ధర్పల్లి: హోన్నాజీపేట్లో బీర్ సీసాతో కొట్టి చంపారు..!

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హోన్నాజిపేట్ గ్రామంలో పాలెం నడిపి మల్లయ్య (55) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడిని భార్య, కొడుకు కలిసి శనివారం రాత్రి చంపేశారని అనుమానిస్తున్నారు. మల్లయ్య తలపై కొడుకు మధు బీరు సీసాతో దాడి చేసి గొంతు నులిమి హత్య చేయగా అందుకు మల్లయ్య భార్య లక్ష్మి సహకరించినట్లు తెలిసింది. ఈ విషయం ఆదివారం ఉదయం వెలుగు చూసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 7, 2025
నావల్ డాక్యార్డ్లో 320 పోస్టులు

విశాఖపట్నంలోని నావల్ డాక్యార్డ్ 320 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు జనవరి 2వరకు అప్లై చేసుకోవచ్చు. NAPS పోర్టల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకోవాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.joinindiannavy.gov.in/
News December 7, 2025
కోనసీమ: ప్రాణం పోయినా.. ప్రభ వాలదు!

కోనసీమ సంక్రాంతి సంబరాల్లో ‘జగ్గన్న తోట ప్రభల తీర్థం’ కలికితురాయి. ఈ ఉత్సవాన్ని ప్రభుత్వం ‘రాష్ట్ర పండుగ’గా గుర్తించింది. కనుమ నాడు ఏకాదశ రుద్రులు కొలువయ్యే అపురూప ఘట్టమిది. నిండుగా పారే కాలువలు, పొలాలను దాటుతూ ‘ప్రాణం పోయినా ప్రభ ఆగకూడదు, నేల వాలకూడదు’ అనే పట్టుదలతో భారీ ప్రభలను భుజాలపై మోసుకొచ్చే దృశ్యం రోమాంచితం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సాగే ఈ జాతర.. కోనసీమ ప్రజల పౌరుషానికి నిలువుటద్దం.
News December 7, 2025
తూ.గో: గగనతలంలో ‘తూర్పు’ ఆశలు!

నేడు ‘అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం’. ఈ నేపథ్యంలో తూ.గో. వాసుల ఆకాంక్షలు బలంగా వినిపిస్తున్నాయి. మధురపూడి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించాలన్నది ప్రజల చిరకాల స్వప్నం. కడియం పూల గుబాళింపులు విదేశాలకు చేరేలా ‘కార్గో’ సేవలు విస్తరించాలని, గోదావరిపై సీప్లేన్ పర్యాటకం కొత్త పుంతలు తొక్కాలని కోరుతున్నారు. వాణిజ్య, పర్యాటక అభివృద్ధికి విమానయాన రంగం ఊతమివ్వాలని ఆశిస్తున్నారు.


