News February 23, 2025
ధర్మపురిలో అత్యధికం.. జగిత్యాలలో అత్యల్పం

జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం వెల్గటూర్, గోధూరు, ధర్మపురి, గొల్లపల్లిలో 38.1℃ ఉష్ణోగ్రత నమోదైంది. అల్లిపూర్ 38, సిరికొండ, కొల్వాయి 37.8 మేడిపల్లి, మారేడుపల్లి 37.7 అల్లిపూర్, నేరేళ్ల, జైన 37.6 పెగడపల్లి 37.3 మల్యాల, రాయికల్ 37.2 రాఘవపేట 36.9 మెట్పల్లి 36.8 గుల్లకోట, మల్లాపూర్, సారంగాపూర్, కథలాపూర్ 36.7 మన్నెగూడెం 36.6 కోరుట్ల, జగిత్యాలలో 36.4℃గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News October 22, 2025
NZB: ఈవీఎం గోడౌన్ను సందర్శించిన కలెక్టర్

నిజామాబాద్ వినాయకనగర్లోని ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్కు వేసిన సీళ్లను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఫైర్ ఆఫీసర్ శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్, సిబ్బంది సాత్విక్, విజయేందర్ రెడ్డి ఉన్నారు.
News October 22, 2025
చిత్తూరులో కంట్రోల్ రూమ్

చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తాయన్నారు. లోతట్టు ప్రజలు వాగులు, వంకల వైపు వెళ్లరాదని సూచించారు. అత్యవసరమైతే ప్రజలు బయటకు రావాలని కోరారు. వర్షాలతో ఏదైనా ఇబ్బంది ఎదురైతే కంట్రోల్ రూము నంబర్లు 9491077325, 08572 242777కు కాల్ చేయాలని కోరారు.
News October 22, 2025
మల్లన్న దర్శనానికి 3 గంటల సమయం

కార్తీక మాసం తొలిరోజు శ్రీశైలం మల్లన్న ఆలయం భక్తజనంతో కిటకిటలాడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఉచిత దర్శనం క్యూలైన్లలో దర్శనానికి వెళ్లేందుకు సుమారు 3 గంటలకుపైగా సమయం పడుతున్నట్లు భక్తులు తెలిపారు. ఆలయ ప్రాంగణాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. అయ్యప్ప దీక్ష దారులు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు.