News March 22, 2025
ధర్మపురి: అగ్ని జ్వాలలో లక్ష్మీనరసింహస్వామి దివ్య రూపం!

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో సుదర్శన నారసింహ హోమ పూర్ణహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అగ్నిజ్వాలలో నరసింహస్వామి అపురూప దృశ్యం దర్శనమిచ్చింది. అగ్నిజ్వాలలో లక్ష్మీనరసింహస్వామి రూపం కనిపించడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మీకు లక్ష్మీనరసింహస్వామి రూపం కనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
Similar News
News October 29, 2025
ఒంటిమిట్ట రామాలయం నూతన అభివృద్ధి పనులకు ఆమోదం: TTD

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయ నూతన అభివృద్ధి పనులకు TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆమోదం తెలిపారు. మంగళవారం తిరుమలలో బోర్డు మీటింగ్ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కళ్యాణ వేదిక వద్ద జాతీయ రహదారి పక్కనే రూ.37 కోట్లతో భక్తులకు 100 గదుల భవనాన్ని, ఆలయం సమీపంలో రూ.2.9 కోట్లతో భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణన్ని కల్పించేలా పవిత్ర వనాన్ని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపినట్లు వివరించారు.
News October 29, 2025
VKB: ఒక్క ఫ్రేమ్లో చరిత్ర!

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చరిత్రలో చిరస్మరణీయ క్షణం ఇది. ప్రజా సేవలో విశేష పాత్ర పోషించిన నలుగురు మాజీ జడ్పీ ఛైర్మన్లు ఒకే ఫ్రేమ్లో దర్శనం ఇవ్వడం అరుదైన సందర్భంగా నిలిచింది. VKB జిల్లా ఏర్పాటుకు ముందు నుంచి ఇప్పటి వరకు ప్రజా సేవలో తమదైన ముద్ర వేసిన ఈ నేతలతో కూడిన పాత ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిత్రాన్ని చూసి నెటిజన్లు “ఒక్క ఫ్రేమ్లో చరిత్ర!” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
News October 29, 2025
SRPT: విద్యే అభివృద్ధికి మూలం: కలెక్టర్

సూర్యపేట మండలంలోని రామన్నగూడెం ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన 4, 5వ తరగతి విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధించి, ఇంగ్లీష్ అర్థాలు, గణిత లెక్కలు అడిగి పరీక్షించారు. విద్యార్థుల ప్రతిభను ప్రశంసించిన కలెక్టర్, ఉపాధ్యాయుల కృషిని ప్రశంశిస్తూ.. “విద్యే అభివృద్ధికి మూలం” అని పేర్కొన్నారు.


