News March 22, 2025
ధర్మపురి: అగ్ని జ్వాలలో లక్ష్మీనరసింహస్వామి దివ్య రూపం!

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో సుదర్శన నారసింహ హోమ పూర్ణహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అగ్నిజ్వాలలో నరసింహస్వామి అపురూప దృశ్యం దర్శనమిచ్చింది. అగ్నిజ్వాలలో లక్ష్మీనరసింహస్వామి రూపం కనిపించడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మీకు లక్ష్మీనరసింహస్వామి రూపం కనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
Similar News
News November 28, 2025
నిర్మల్: 2019లో 88 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం..!

2019లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిర్మల్ జిల్లాలో 88 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 396 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఈ ఏడు 4 GPలు పెరిగాయి. ప్రస్తుతం 400 గ్రామ పంచాయతీలు ఉండగా.. 3,396 వార్డులున్నాయి. అయితే అప్పటి ప్రభుత్వం పంచాయతీలను ఏకగ్రీవం చేస్తే రూ.10లక్షలు ఇస్తామని ప్రకటించినా.. నేటికి ఆ సొమ్ము GP ఖాతాల్లో జమ కాలేదు. అటు ఏకగ్రీవం చేస్తే కేంద్రం నుంచి రూ.10లక్షలు ఇస్తామని బండి ప్రకటించారు.
News November 28, 2025
ప్రకాశం జిల్లా వాసులకు గుడ్ న్యూస్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్తంగా శుక్రవారం పామూరు ఈటీఎన్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సుబ్బారావు తెలిపారు. 10, ఇంటర్, డిగ్రీ, ఆపై చదివిన విద్యార్థులు హాజరు కావాలన్నారు. నెలకి రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు జీతం వస్తుందన్నారు. పూర్తి వివరాలకు. 99888 53335 నంబరును సంప్రదించాలన్నారు.
News November 28, 2025
చెక్క దువ్వెన వాడుతున్నారా?

జుట్టు ఆరోగ్యం కోసం ప్రస్తుతం చాలామంది చెక్క దువ్వెన వాడుతున్నారు. కానీ దీన్ని క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా పెరిగిపోతుంది. గోరువెచ్చని నీటిలో డిష్వాష్ లిక్విడ్/ షాంపూ, కొబ్బరి, ఆలివ్ నూనెలను కలపాలి. దువ్వెనను ఈ మిశ్రమంలో 2 నిమిషాలు ఉంచి బ్రష్తో రుద్దాలి. తర్వాత ఎండలో ఆరబెడితే సరిపోతుంది. నీటితో వద్దు అనుకుంటే నూనెను దువ్వెన మొత్తం పట్టించి ఓ అరగంటయ్యాక బ్రష్తో దువ్వెన పళ్లను శుభ్రం చేయాలి.


