News February 17, 2025
ధర్మపురి: ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.62,910 ఆదాయం

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,29,874 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.57,208, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.62,910 అన్నదానం రూ.9,756 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
Similar News
News November 4, 2025
బోయిన్పల్లిలో దారుణం.. చిన్నారిపై డాన్స్ మాస్టర్ వేధింపులు

ఓల్డ్ బోయిన్పల్లిలోని సుబ్బు డాన్స్ స్టూడియో నిర్వాహకుడు జ్ఞానేశ్వర్ నాలుగేళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. 2 నెలలుగా డాన్స్ స్కూల్కు వెళ్తున్న చిన్నారి ఈమధ్య ఆకస్మికంగా మానేసింది. చిన్నారి చెప్పిన వివరాల మేరకు తల్లిదండ్రుల ఫిర్యాదుతో బోయిన్పల్లి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. స్టూడియోను మూసివేసినట్లు ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు.
News November 4, 2025
పాక్ ప్లేయర్ హరీస్ రవూఫ్పై ఐసీసీ వేటు

ఆసియా కప్లో కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించిన ఆటగాళ్లపై ICC చర్యలు తీసుకుంది. పాక్ ప్లేయర్ హరీస్ రవూఫ్పై 2 మ్యాచుల బ్యాన్ విధించింది. 24 నెలల వ్యవధిలో 4 డీమెరిట్ పాయింట్లు తెచ్చుకున్నందుకు ఈ వేటు వేసింది. 2 మ్యాచుల్లో 30% చొప్పున ఫీజులో కోత పెట్టింది. మరో ఆటగాడు ఫర్హాన్కు ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చింది. ఇక <<17831364>>సూర్య<<>>కు మ్యాచ్ (14వ తేదీ) ఫీజులో 30% కోత, 2 డీమెరిట్ పాయింట్లను విధించింది.
News November 4, 2025
నిర్మల్ జిల్లాలో యువకుడి ARREST

నిర్మల్ జిల్లా పెంబి మండలం పోచమ్మపల్లికి చెందిన యువకుడు మెగావత్ వినోద్ ఎండు గంజాయిని బైక్పై తరలిస్తుండగా పట్టుకున్నట్లు నిర్మల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రంగస్వామి తెలిపారు. ఆదిలాబాద్ నుంచి ఎండు గంజాయిని నిర్మల్కు తరలిస్తుండగా కొండాపూర్ బ్రిడ్జి వద్ద పట్టుకున్నామన్నారు. అతడి వద్ద 1.710కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామన్నారు. ఎస్ఐ అభిషేకర్, వసంత్ రావ్ ఉన్నారు.


