News February 17, 2025

ధర్మపురి: ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.62,910 ఆదాయం

image

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,29,874 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.57,208, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.62,910 అన్నదానం రూ.9,756 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.

Similar News

News April 11, 2026

NTR: వేడినీళ్ల కాలువలో పడి వ్యక్తి దుర్మరణం (ఫైల్ ఫొటో)

image

ఇబ్రహీంపట్నంలోని వేడినీళ్ల కాలువలో పడి శంకర్రావు (55) అనే ఆటో డ్రైవర్ మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. కొత్త గేటు ప్రాంతానికి చెందిన ఆయన శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు కాలువలో పడి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 11, 2026

WGL: క్యూఆర్ కోడ్‌తో ప్రజాభిప్రాయం

image

వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసుల పనితీరుపై ప్రజలు నేరుగా అభిప్రాయం తెలియజేయడానికి ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అన్ని పోలీస్ స్టేషన్లలో క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు ఏర్పాటు చేసి, వాటిని స్కాన్ చేస్తే ప్రత్యేక ఫారమ్ ద్వారా ఫీడ్‌బ్యాక్ ఇవ్వొచ్చు. ఫిర్యాదులపై స్పందన, పోలీసుల ప్రవర్తన వంటి అంశాలపై మంచి-చెడు అభిప్రాయాలను గోప్యంగా తెలియజేసే అవకాశం కల్పించారు. ఈ విధానం ద్వారా పారదర్శకత పెరగనుంది.

News April 11, 2026

ఆదోని ఎమ్మెల్యే చుట్టూ వివాదం.. పోస్టర్లు వైరల్

image

ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై అవినీతి ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. వారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్లు హాట్ టాపిక్‌గా మారాయి. టీడీపీ నేత సౌదీ రావుఫ్ రూ.10 లక్షల లంచం నిజమేనని, ఈ పోస్టర్ల ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించాలని అందులో రాసి ఉంది. ఇదే సమయంలో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.