News February 8, 2025

ధర్మపురి: బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం

image

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ శివార్లలో వాగు వద్ద గల బావిలో ఓ వ్యక్తి మృతదేహం శుక్రవారం రాత్రి లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బహిర్భూమి కోసం వచ్చి ప్రమాదవశాత్తు బావిలో పడి ఉంటాడని తెలుపుతున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి ఎస్‌ఐ ఉదయ్ వెళ్లి పరిశీలించారు. మృతుడు జగిత్యాలకు చెందిన ఎండీ హమీద్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 22, 2025

MDK: కొమురం భీమ్ ఆశయాలతోనే బీఆర్ఎస్ పాలన: కేసీఆర్

image

ఆదివాసీ గిరిజన హక్కుల కోసం పోరాడిన గోండు వీరుడు కొమురం భీమ్ ఆత్మగౌరవ పోరాటం తెలంగాణ సాధన ఉద్యమాలకు స్ఫూర్తి అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. ఆయన జయంతి సందర్భంగా కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. జల్, జంగల్, జమీన్ నినాదంతో భీమ్ ఆశయాలను బీఆర్ఎస్ పాలనలో అమలు చేశామని, ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతికి కృషి చేయడం ద్వారానే నిజమైన నివాళి అవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు.

News October 22, 2025

రెవెన్యూ సేవలు సకాలంలో అందించాలి: కలెక్టర్

image

రెవెన్యూ సేవల విషయంలో భూ సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నంద్యాల పట్టణం ఎన్జీవోస్ కాలనీలోని 18వ సచివాలయంలో రెవెన్యూ సంబంధిత సేవలలో ఆలస్యాలు, ప్రజల్లో అసంతృప్తికి దారితీస్తున్న నేపథ్యంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. జనవరి నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రజల నుంచి అందిన 332 దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు.

News October 22, 2025

కొత్తకోట: రెండు వాహనాలు ఢీ.. 8 మందికి గాయాలు

image

కొత్తకోట మండలం నాటవెల్లి-ముమ్మాలపల్లి గ్రామాల మధ్య NH- 44 పై బొలెరో, తుఫాన్ ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాదు నుంచి పెబ్బేరు వైపు ప్రయాణికులతో వెళుతున్న తుఫాన్, కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళుతున్న బొలెరోను ఢీకొంది. క్షతగాత్రుల్ని వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.