News March 15, 2025

ధర్మపురి: బ్రహ్మోత్సవంలో సంస్కృతి నాట్య నీరాజనం

image

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కరీంనగర్‌కు చెందినటువంటి సంస్కృతి సంగీత నృత్యాలయం చిన్నారులు కూచిపూడి నృత్యాలతో భక్తులను మంత్రముగ్ధులను చేశారు. రామా కోదండరామ, అన్నమాచార్య కీర్తన, అంతయు నీవే సౌభాగ్యలక్ష్మీ, రావమ్మ ఆనంద తాండవ, మాడెన్ శివుడు నృత్యాలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు, ఈవో శ్రీనివాస్, గణేష్, నాట్యచార్యులు సురేంద్రచారి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Similar News

News November 10, 2025

చొప్పదండి: 200 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

image

గంగాధర మండలం రంగరావుపల్లిలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన భారీ రేషన్ బియ్యాన్ని సోమవారం విజిలెన్స్ & సివిల్ సప్లైస్ అధికారులు పట్టుకున్నారు. సుమారు 200 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, బియ్యం నిల్వ చేసిన ఇల్లు ఎవరిది? వ్యాపారం చేస్తున్న వ్యక్తి ఎవరు అనే వివరాలు తెలియాల్సి ఉంది.

News November 10, 2025

‘ప్రజావాణి’కి 339 దరఖాస్తులు: జిల్లా కలెక్టర్

image

కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 339 దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆమె తెలిపారు. దరఖాస్తుల్లో అత్యధికంగా కరీంనగర్ నగర పాలికకు 68, హౌసింగ్ శాఖకు సంబంధించి 43 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు.

News November 10, 2025

కరీంనగర్: సీఐటీయూ నూతన కార్యవర్గం ఎన్నిక

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన సీఐటీయూ జిల్లా 11వ మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఉప్పునీటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా గిట్ల ముకుంద రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సీఐటీయూ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.