News March 20, 2025

ధర్మపురి: రథోత్సవంలో జేబుదొంగ

image

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి రథోత్సవంలో ఓ జేబుదొంగ పోలీసులకు చిక్కాడు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రథోత్సవం కొనసాగింది. రథాల వద్ద ఉన్న ఓ భక్తుని జేబులో చేయి పెడుతుండగా అక్కడే ఉన్న గొల్లపల్లి ఎస్ఐ సతీష్ గమనించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. వెంటనే సదరు వ్యక్తి జేబును వెతకగా జేబులో నుంచి దాదాపు నాలుగైదు పర్సులు, కొంత నగదు లభించాయి. వెంటనే జేబుదొంగను స్టేషన్ కు తరలించారు.

Similar News

News November 21, 2025

BREAKING: మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ బదిలీ.. కొత్త ఎస్పీగా శబరీష్

image

మహబూబాబాద్ జిల్లా నూతన ఎస్పీగా శబరీష్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో శబరీష్ ములుగు జిల్లాలో ఎస్పీగా విధులు నిర్వహిస్తూ బదిలీల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లాకు వచ్చారు. ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌ను ములుగు జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులను వెలువరించింది.

News November 21, 2025

వికారాబాద్ నూతన ఎస్పీగా స్నేహ మెహ్రా

image

రాష్ట్రంలో ఐపీఎస్‌ల బదిలీల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నూతన ఎస్పీగా స్నేహ మెహ్రాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీగా నారాయణరెడ్డి ఉన్న సమయంలోనే లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటన జరిగింది.

News November 21, 2025

ఉద్దానం కిడ్నీ వ్యాధులపై పరిశోధన ప్రారంభం

image

శ్రీకాకుళం జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో కిడ్నీ వ్యాధులపై సమగ్ర అధ్యయనం ప్రారంభించామని కిడ్నీ వ్యాధుల పరిశోధన ప్రాజెక్టు మెంటర్ డా.టి.రవిరాజు అన్నారు. ఉద్దానం ప్రాంతంలో 18% జనాభా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైందన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.6.01కోట్లు ఖర్చు అవుతుందని అంచానా వేశారు. ఇచ్చాపురం, కంచిలి, పలాస, కవిటి, మందస, వజ్రపు కొత్తరు ప్రాంతాల్లో పరిశోధన చేస్తున్నామన్నారు.