News March 20, 2025

ధర్మపురి: రథోత్సవంలో జేబుదొంగ

image

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి రథోత్సవంలో ఓ జేబుదొంగ పోలీసులకు చిక్కాడు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రథోత్సవం కొనసాగింది. రథాల వద్ద ఉన్న ఓ భక్తుని జేబులో చేయి పెడుతుండగా అక్కడే ఉన్న గొల్లపల్లి ఎస్ఐ సతీష్ గమనించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. వెంటనే సదరు వ్యక్తి జేబును వెతకగా జేబులో నుంచి దాదాపు నాలుగైదు పర్సులు, కొంత నగదు లభించాయి. వెంటనే జేబుదొంగను స్టేషన్ కు తరలించారు.

Similar News

News November 24, 2025

BELOPలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

BEL ఆప్ట్రోనిక్ డివైసెస్ లిమిటెడ్(<>BELO<<>>P)3 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ప్రాసెస్ ఇంజినీర్, ల్యాబోరేటరీ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు డిసెంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in/

News November 24, 2025

భారత్‌కు మరో ఓటమి తప్పదా?

image

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ఓడిన టీమ్ఇండియా రెండో టెస్టులోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్సులో 201 పరుగులకే ఆలౌటై సఫారీలకు 288 రన్స్ ఆధిక్యాన్ని కట్టబెట్టింది. అటు రేపు, ఎల్లుండి ఆట మిగిలి ఉండటంతో దూకుడుగా ఆడి <<18376327>>లీడ్<<>> పెంచుకోవాలని సఫారీ జట్టు చూస్తోంది. రెండో ఇన్నింగ్సులోనూ భారత ప్లేయర్లు ఇదే ప్రదర్శన చేస్తే 0-2తో సిరీస్‌ను చేజార్చుకునే ప్రమాదముంది. దీంతో WTCలో స్థానం దిగజారనుంది.

News November 24, 2025

పెద్దపల్లి కోర్టు ఏర్పాటు వివాదం.. సుల్తానాబాద్ న్యాయవాదుల ఆగ్రహం

image

పెద్దపల్లి జిల్లా కోర్టును పెద్దపల్లిలోనే ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే విజయరమణరావును కలిసి వినతిపత్రం ఇచ్చిన న్యాయవాదులను ఎమ్మెల్యే అవమానించారనే ఆరోపణలతో సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు సోమవారం కోర్టు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. అసోసియేషన్ అధ్యక్షులు మేకల తిరుపతిరెడ్డి, కార్యదర్శి భూమయ్యతో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.