News March 4, 2025

ధర్మపురి: రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి

image

ధర్మపురి మండలం గాదెపల్లిలో రెండు బైకులు ఢీకొని ఒకరు స్పాట్‌లోనే మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా రెండు బైకులు వేగంగా ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఒక వ్యక్తి స్పాట్లోనే మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 5, 2025

కుంభమేళాలో రూ.30 కోట్లు సంపాదించిన ఫ్యామిలీ: సీఎం

image

కిడ్నాప్, చోరీ, మర్డర్ లాంటి ఘటనలు జరగకుండా మహాకుంభమేళాను విజయవంతంగా నిర్వహించామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. రూ.7,500 కోట్లు ఖర్చు చేస్తే పలు రంగాలకు రూ.3లక్షల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. అనేక కుటుంబాలు లాభపడ్డాయని తెలిపారు. ఓ ఫ్యామిలీ 130 బోట్లను నడిపిస్తూ రూ.30కోట్లు సంపాదించిందని పేర్కొన్నారు. రోజుకు ఒక్కో బోటు నుంచి రూ.52వేలు లాభం పొందిందని ఓ సక్సెస్ స్టోరీని వివరించారు.

News March 5, 2025

TTD Update: నేరుగా శ్రీవారి దర్శనం

image

తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. క్యూ కాంప్లెక్స్‌లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులకు శ్రీవారి దర్శనం నేరుగా లభిస్తోంది. నిన్న శ్రీవారిని 64,861 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,639 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా శ్రీవారికి రూ.3.65 కోట్ల ఆదాయం సమకూరింది.

News March 5, 2025

సీసీ కుంట: ప్రమాదవశాత్తు బావిలో పడి వృద్ధురాలి మృతి

image

సీసీకుంట మండలం గూడూర్ గ్రామ శివారులో బావిలో పడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. అమరచింత మం. మస్థిపురానికి చెందిన గుండమ్మ(77) కురుమూర్తి స్వామి దర్శనానికి గతనెల 28న వెళ్లింది. ఆలయ పరిసరాల్లో అటుఇటు తచ్చాడుతూ పలువురికి కనిపించింది. ఇంతలోనే బావిలో ఆమె మృతదేహం కనిపించింది. ప్రమాదవశాత్తు బావిలో పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!