News April 7, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అదివారం రూ.1,77,684 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.82,098 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.87,100, అన్నదానానికి రూ.8,486 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

Similar News

News November 15, 2025

విశాఖ-కాకినాడ-భీమిలి నుంచి క్రూయిజ్ టూరిజంపై చర్చ

image

కోర్డెలియా క్రూయిజెస్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు శనివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో కోస్టల్ టూరిజాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని, ఇందుకు కోర్డెలియా క్రూయిజెస్‌ కలిసి రావాలని సీఎం కోరారు. విశాఖ-కాకినాడ-భీమిలి పోర్టుల నుంచి క్రూయిజ్ టూరిజం సేవలు అందించడంపై చర్చించారు. క్రూయిజ్ టెర్మినల్ సౌకర్యాలు, బీచ్ టూరిజం, వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్‌పై కోర్డెలియా క్రూయిజెస్‌ ఆసక్తి చూపింది.

News November 15, 2025

రైల్ వీల్ ఫ్యాక్టరీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు

image

బెంగళూరులోని <>రైల్<<>> వీల్ ఫ్యాక్టరీ స్పోర్ట్స్ కోటాలో 15 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్, కబడ్డీ, ఫుట్‌బాల్, చెస్‌లో పతకాలు సాధించినవారు ఈనెల 29వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ITI, ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18- 25ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://rwf.indianrailways.gov.in/

News November 15, 2025

బాపట్ల జిల్లా టూరిజంకు ప్రసిద్ధి: కలెక్టర్

image

బాపట్ల జిల్లా టూరిజంకు ప్రసిద్ధి చెందిందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలో సూర్యలంక బీచ్, రామాపురం బీచ్‌లకు ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారని, అక్కడ రిసార్ట్‌లు బాగా అభివృద్ధి చెందాయని, పరిసరాలను ఎల్లవేళలా పరిశ్రమంగా ఉంచి, పర్యాటకులను ఆకర్షించాలన్నారు. పర్యాటకులు ఎక్కువగా జిల్లాకు వచ్చినప్పుడు ఆదాయం పెరుగుతుందని తద్వారా జీడీపీ రేటు పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.