News April 10, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.1,00,715 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. టికెట్లు అమ్మకం ద్వారా రూ.38,166, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.55,815, అన్నదానానికి రూ.6,734 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
Similar News
News December 5, 2025
GNT: ఒక్క రోజు మీకు ఇస్తే.. మీ ప్రాధాన్యత ఏంటి.?

గుంటూరు జిల్లాను పట్టిపీడిస్తున్న సమస్యలెన్నో. గుంతల రోడ్లు, పొంగే డ్రైనేజీలు, తాగునీటి కష్టాలు, ట్రాఫిక్ నరకం.. జనం నిత్యం అవస్థలు పడుతున్నారు. మరి మీకు ఒక్కరోజు సమస్య పరిష్కరించే అధికారం దక్కితే.. వీటిలో ఏ సమస్యను అత్యవసరంగా పరిష్కరిస్తారు? మీ ప్రాధాన్యత ఏంటి? రోడ్లా? నీళ్లా? డ్రైనేజీనా? మీ మనసులో మాట చెప్పండి! ఈ ఒక్కరోజు ఛాన్స్ మీకైతే.. పట్టణ రూపురేఖలు ఎలా మారుస్తారు? కామెంట్ చేయండి.
News December 5, 2025
మాలధారణలో ఉన్నప్పుడు బంధువులు మరణిస్తే..?

అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు రక్తసంబంధీకులు మరణిస్తే వెంటనే మాల విసర్జన చేయాలి. మరణించిన వ్యక్తి దగ్గరి బంధువు అయినందున గురుస్వామి వద్ద ఆ మాలను తీసివేయాలి. ఈ నియమం పాటించిన తర్వాత ఓ ఏడాది వరకు మాల ధరించకూడదు. అయితే దూరపు బంధువులు, మిత్రులు మరణిస్తే, మాలధారులకు ఎలాంటి దోషం ఉండదు. వారు మరణించినవారిని తలచుకొని, స్నానం చేసి స్వామిని ప్రార్థిస్తే సరిపోతుంది. <<-se>>#AyyappaMala<<>>
News December 5, 2025
వారికి కూడా చీరలు.. సీఎం కీలక ప్రకటన

TG: 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలను అందించే బాధ్యత మంత్రులు సీతక్క, సురేఖకు అప్పగిస్తున్నట్లు CM రేవంత్ చెప్పారు. ‘ప్రస్తుతం 65L చీరలు పంపిణీ చేశాం. ఇంకా 35L చీరలు రావాలి. ఎన్నికల కోడ్తో ఆగిన చోట్ల, పట్టణ ప్రాంతాల మహిళలకూ MAR 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చీరలు ఇస్తాం’ అని ప్రకటించారు. డ్వాక్రా మహిళలు, వైట్ రేషన్ కార్డు ఉన్న మహిళలకు ప్రస్తుతం చీరలు ఇస్తున్న విషయం తెలిసిందే.


