News April 10, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.1,00,715 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. టికెట్లు అమ్మకం ద్వారా రూ.38,166, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.55,815, అన్నదానానికి రూ.6,734 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
Similar News
News September 18, 2025
చిన్నమండెం: గుండెపోటుతో టీచర్ మృతి

చిన్నమండెం మండలం చాకిబండ తెలుగు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న బీవీ శ్రీధర్ రెడ్డి బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. విద్యార్థులకు పాఠాలు చెబుతుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే తోటి ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలిస్తుండగా.. దారి మధ్యలో చనిపోయారు. ఆయన మృతి పట్ల మండల వ్యాప్తంగా ఉపాధ్యాయులు విచారం వ్యక్తం చేశారు.
News September 18, 2025
కర్నూలు మార్కెట్ యార్డుకు నేడు, రేపు సెలవు

కర్నూలు మార్కెట్ యార్డుకు ఇవాళ, రేపు సెలవు ప్రకటించినట్లు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ బి.నవ్య తెలిపారు. మార్కెట్ యార్డులో ఉల్లి నిల్వలు ఎక్కువగా ఉన్నాయని, ఉల్లిని ట్రేడింగ్, బహిరంగ వేలం ద్వారా బయటకు తరలించడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇవాళ, రేపు ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో ఉల్లి విక్రయాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలన్నారు.
News September 18, 2025
తిరుపతి: DSC అభ్యర్థులకు గమనిక

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో DSCకి ఎంపికైన అభ్యర్థులందరికీ CM చంద్రబాబు చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వనున్నారు. ఈనేపథ్యంలో ఉద్యోగాలకు ఎంపికన వారంతా రేణిగుంట రోడ్డులోని చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కాలేజీ వద్దకు ఇవాళ ఉదయం 7గంటలకు చేరుకోవాలని DEO కేవీఎన్ కుమార్ కోరారు. ఫొటో, ఆధార్, కాల్ లెటర్తో వస్తే వారిని బస్సుల్లో విజయవాడకు తీసుకెళ్తామన్నారు.