News April 16, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,87,853 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,25,162, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.51,310, అన్నదానానికి రూ.11,381 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ పేర్కొన్నారు.
Similar News
News January 8, 2026
వరంగల్ అభివృద్ధిపై బల్దియా ఆఫీసులో రివ్యూ

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వరద కాలువల పునరుద్దరణపై రివ్యూ నిర్వహించారు. మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, ప్రకాశ్ రెడ్డి, నాగరాజు, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అధికారులు రివ్యూలో పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి ఏర్పాటుకు పూర్తి స్థాయి డీపీఆర్ సిద్ధం చేయాలని ఎమ్మెల్యేలు అన్నారు.
News January 8, 2026
జగిత్యాల: ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల సంక్షేమానికి కృషి

ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని టీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల జోనల్, జిల్లా గౌరవాధ్యక్షుడు ఓరుగంటి రమణారావు తెలిపారు. గురువారం జగిత్యాల పట్టణంలోని ఎల్జీ గార్డెన్స్లో టీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 2026 డైరీని ఆయన ఆవిష్కరించారు. అనంతరం నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర,జోనల్ నాయకులు, పెద్ద సంఖ్యలో రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు.
News January 8, 2026
సర్వే మిషన్లపై పూర్తి అవగాహన ఉండాలి: కలెక్టర్ స్నేహ శబరీష్

భూమి కొలతల్లో ఖచ్చితత్వం కోసం అత్యాధునిక సర్వే మిషన్లపై లైసెన్స్డ్ సర్వేయర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో ధర్మసాగర్, హసన్ పర్తి మండలాల సర్వేయర్లకు నిర్వహిస్తున్న శిక్షణను ఆమె పరిశీలించారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని, భూముల సర్వేలో ఎటువంటి తప్పులు లేకుండా ఖచ్చితమైన కొలతలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.


