News August 8, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.1,12,370 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.48,248, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.50,000, అన్నదానం రూ.14,122, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.

Similar News

News January 25, 2026

KNR: ‘విద్యార్థులను తీర్చిదిద్దడం ముఖ్య ఉద్దేశం’

image

కరీంనగర్ కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన టెడ్ టాక్స్‌తో నిర్వహించిన విద్యార్థులు అందరినీ ఆకట్టుకున్నారని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వ విద్యార్థులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి వారిని తీర్చిదిద్దడం జిల్లా యంత్రాంగం ముఖ్య ఉద్దేశమని అన్నారు. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాలు మరిన్ని కొనసాగిస్తామని తెలిపారు.

News January 25, 2026

KNR: ఆర్థిక ఇబ్బందులు.. తండ్రి ఆత్మహత్య!

image

ఉద్యోగాలు రాని కొడుకులు.. వసూలు కాని అప్పులతో మనస్తాపం చెందిన ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. కరీంనగర్(D) మానకొండూరు మండలం అన్నారానికి చెందిన శంకరాచారి (58) శనివారం తేజాప్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కొడుకులకు ఉద్యోగాలు రాకపోవడం, ఇచ్చిన అప్పుల వసూలుకావడం లేదనే బాధతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 24, 2026

KNR: ఆర్టీసీకి 14 రోజుల్లో రూ.46.37 కోట్ల ఆదాయం

image

సంక్రాంతి పండుగ సందర్భంగా కరీంనగర్ రీజియన్ పరిధిలో ఆర్టీసీకి భారీ ఆదాయం సమకూరింది. ఈనెల 7 నుంచి 20వ తేదీల్లో మొత్తంగా 1528 అదనపు బస్సులు నడపగా.. 14 రోజుల్లో రూ.46.37 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక కరీంనగర్ రీజియన్ పరిధిలో కరీంనగర్-2 డిపోలో రూ.7.78 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా మంథని డిపోలో రూ. 2.43 కోట్లతో చివరి స్థానంలో ఉంది.