News August 12, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రూ.3,39,377 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,66,512, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,38,000, అన్నదానం రూ.34,865, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

Similar News

News October 29, 2025

జమ్మికుంట: మార్కెట్‌కు 4 రోజులు సెలవులు

image

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు 4 రోజులు సెలవులు ప్రకటించామని మార్కెట్ ఛైర్ పర్సన్ పుల్లూరి స్వప్న, ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం తెలిపారు. తుఫాన్ కారణంగా ఖరీదారులు, అడ్తిదారుల విన్నపం మేరకు ఈనెల 30, 31, NOV 1న మార్కెట్ యార్డుకు మూడు రోజులు సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉంటుందని పేర్కొన్నారు. CCI ద్వారా యధావిధిగా క్రయవిక్రయాలు జరుగుతాయని పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు, కార్మికులు గమనించాలన్నారు.

News October 29, 2025

‘ప్రభుత్వ సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’

image

ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ సేవల్లో నిజాయితీ పెంచాలని, ప్రతి ఉద్యోగికి తన పనిలో జవాబుదారీతనం ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News October 28, 2025

కరీంనగర్‌లో పీజీ వైద్య విద్యార్థి ఆత్మహత్య

image

కరీంనగర్ ప్రతిమ వైద్య కళాశాలలో పీజీ ద్వితీయ సంవత్సరం అనస్తీషియా విభాగంలో చదువుతున్న శ్రీనివాస్ అనే వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మత్తు ఇంజక్షన్ తీసుకుని తన గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషాదం సంఘటనతో కళాశాల పరిసరాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.