News September 13, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి నేటి ఆలయ ఆదాయ వివరాలు

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.49,303 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.27,846, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.16,050, అన్నదానం రూ.5,407 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
Similar News
News February 28, 2026
KNR: ప్రతి విద్యార్థి ఒక శాస్త్రవేత్తగా ఆలోచించాలి: ప్రొ.తిరుపతి

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని SRR ప్రభుత్వ కళాశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని వృక్ష శాస్త్ర విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పడాల మాట్లాడారు. మన దేశ శాస్త్రవేత్తలను గౌరవిస్తూ, మూఢనమ్మకాలను విడిచి శాస్త్రీయ దృక్పథంతో మెలుగుదామన్నారు. “వికసిత భారత్” కల సాకారం కావాలంటే ప్రతి విద్యార్థి ఒక చిన్న శాస్త్రవేత్తగా ఆలోచించాలని, విద్యార్థులు పరిశోధనల వైపు మలగాలని పిలుపునిచ్చారు.
News February 27, 2026
BREAKING: కరీంనగర్లో కొలువుదీరిన కొత్త కలెక్టర్

కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్గా చిత్రా మిశ్రా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లోని ఆమె ఛాంబర్లో బాధ్యతలు చేపట్టగా.. నూతన కలెక్టర్కు అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్ పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చిత్రా మిశ్రా పేర్కొన్నారు.
News February 27, 2026
KNR: క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్

తెలంగాణ క్రీడా పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా క్రీడాధికారి శ్రీనివాస్ తెలిపారు. 01-09-2017 నుంచి 31-08-2018 మధ్య జన్మించిన విద్యార్థులు మార్చి 4లోగా tgss.telangana.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. మార్చి13 నుంచి మండల, 28 నుంచి జిల్లా, ఏప్రిల్ 27 నుంచి రాష్ట్రస్థాయి ఎంపికలు జరుగుతాయి. వివరాలకు 9704061725 సంప్రదించండి.


