News December 3, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,94,988 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.87,154, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.79,950, అన్నదానం రూ.27,884,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
Similar News
News November 25, 2025
NPDCL కరీంనగర్ సర్కిల్ POగా మునీందర్

NPDCL KNR సర్కిల్ ఇన్ఛార్జ్ పీవోగా S.మునీందర్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పీవోగా పనిచేసిన B.చంద్రయ్యకు అసిస్టెంట్ సెక్రటరీగా పదోన్నతి కల్పిస్తూ వరంగల్ సర్కిల్ కార్యాలయంలో పోస్టింగ్ ఇస్తూ సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో PO పోస్టుకు ఖాళీ ఏర్పడడంతో మునీందర్కు ఇన్ఛార్జ్ పీవోగా బాధ్యతలు అప్పగించారు. ఒక ADEకి DEగా, 10 మంది ఏఈలకు ADEలుగా, 5 మంది సబ్ ఇంజినీర్లకు ఏఈలుగా పదోన్నతి కల్పించారు.
News November 25, 2025
HZB: పేదలకు మెరుగైన వైద్యం అందజేయాలి: బండి

కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి సందర్శించారు. సుమారు కోటిన్నర రూపాయల విలువైన ఆధునిక వైద్య పరికరాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
News November 25, 2025
KNR: భవన నిర్మాణ కార్మికులకు అవగాహన సదస్సులు

భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై పది రోజుల పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఉప కార్మిక కమిషనర్ తెలిపారు. లేబర్ కమిషనర్ హైదరాబాద్ ఆదేశాల మేరకు డిసెంబర్ 3 వరకు ఈ సదస్సులు జరుగుతాయి. ప్రమాద బీమా, సహజ మరణం, పెళ్లి కానుక, ప్రసూతి లబ్ధి వంటి అంశాలపై నిర్వహించే ఈ సదస్సులను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


