News January 22, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,38,986 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.94,801, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.37,180, అన్నదానం రూ.7,005, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
Similar News
News February 16, 2025
కరీంనగర్: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో.!

KNR, NZB, ADB, MDK టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా బావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
News February 16, 2025
కాటారం సబ్ డివిజన్ అడవుల్లో పెద్దపులి!

కాటారం సబ్ డివిజన్ పరిధిలోని అడవుల్లో పెద్దపులి సంచారం కలవరపెడుతోంది. వారం రోజులుగా 15 కిలోమీటర్ల రేడియస్లోని అడవుల్లో తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అటవీ అధికారులు పులి జాడ కోసం అడవి అంతా జల్లెడ పడుతున్నారు. మహాదేవపూర్ మండలం అన్నారం అడవుల్లో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు అడవిలోకి వెళ్లొద్దని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.
News February 16, 2025
కరీంనగర్: ‘కేసీఆర్కు పట్టిన గతే సీఎంకు పడుతుంది’

ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడే స్థాయి సీఎం రేవంత్ రెడ్డికి లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. శనివారం కరీంనగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలన్నారు. లేకపోతే మాజీ సీఎంలు కేసీఆర్, కేజ్రీవాల్కు పట్టిన గతే పడుతుందన్నారు. బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్యలను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.