News January 26, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.1,96,549 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.75,680, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.75,680, అన్నదానం రూ.20,591,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
Similar News
News November 19, 2025
ఆపరేషన్ కగార్.. వరంగల్ అన్నల రక్త చరిత్ర..!

కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ దాడుల్లో ఉమ్మడి WGL జిల్లాకు చెందిన పలువురు కీలక మావోయిస్టు నేతలు ఈ ఏడాదిలో హతమయ్యారు. సెప్టెంబర్ 11న ఛత్తీస్గఢ్ గరియాబాద్ అడవుల్లో మడికొండకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ మృతి చెందగా, జూన్ 18న ఏవోబీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేశ్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అలాగే రేణుక, సారయ్య, రాకేశ్ కూడా బీజాపూర్, అబూజ్మడ్ అడవుల్లో మృతి చెందారు.
News November 19, 2025
ముత్యాలమ్మపాలెం: చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు గల్లంతు

పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం సముద్ర తీరం నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు సూరాడ ముత్యాలు గల్లంతయ్యాడు. బుధవారం ఉదయం ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళుతుండగా అలల తాకిడికి పడవ బోల్తా పడింది. చింతకాయల పెంటయ్య, అర్జిల్లి బండియ్య గాయాలతోను మిగిలినవారు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మత్స్యకార సంఘం రాష్ట్ర నాయకుడు చింతకాయల ముత్యాలు మెరైన్ పోలీసులు, అధికారులకు ఫిర్యాదు చేశారు.
News November 19, 2025
మావోయిస్టుల కథ ముగిసినట్టేనా?

‘ఆపరేషన్ కగార్’తో మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్లు ఒక్కొక్కరిగా హతం అవుతున్నారు. 5 నెలల్లో ఐదుగురు సభ్యులు మృతి చెందారు. వారిలో సుధాకర్, బాలకృష్ణ, రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, అంజు దాదా ఉన్నారు. మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, చంద్రన్న తదితర కీలక సభ్యులు లొంగిపోయారు. పలువురు ప.బెంగాల్లో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. తాజాగా హిడ్మా మృతితో కేంద్ర నాయకత్వం మరింత బలహీనపడింది.


