News January 27, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రూ.2,06,182 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,11,055ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.61,090, అన్నదానం రూ.34,037,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

Similar News

News October 27, 2025

నర్వ: వారు చేసిన పని.. ఒక ప్రాణం తీసింది!

image

గత వారం గాజులయ్య తండా సమీపంలో రోడ్డుకు ఉన్న చెట్లకు పశువులను కట్టేయడంతో, బైక్‌పై వెళ్తున్న నర్వ మండలం ఉందేకోడు గ్రామానికి చెందిన వాటర్‌మెన్‌ నర్సింలు (52) అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. రోడ్డు పక్కన పశువులను కట్టేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఒక నిండు ప్రాణం బలైందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News October 27, 2025

HYD: కలెక్టర్ల సమక్షంలో నేడు లక్కీ డ్రా

image

HYD, MDCL, RR, VKB జిల్లాల కలెక్టర్ల సమక్షంలో నేడు ఉ.11 గంటలకు మద్యం షాపులకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. శంషాబాద్, సరూర్‌నగర్ డివిజన్లలోని మద్యం దుకాణాలకు శంషాబాద్ మల్లికా కన్వెన్షన్ సెంటర్‌లో లక్కీ డ్రా నిర్వహించనుండగా.. సరూర్‌నగర్‌లో 7,845, శంషాబాద్‌లో 8,536, మేడ్చల్‌లో 5,791, వికారాబాద్‌లో 1,808, సికింద్రాబాద్‌లో 3,022, హైదరాబాద్‌లో 3,201, మల్కాజిగిరిలో 6,063 దరఖాస్తులు వచ్చాయి.

News October 27, 2025

పాలమూరు: కొత్త మద్యం లైసెన్స్‌ దారులు ఎవరు? నేడు లక్కీడిప్‌

image

ఉమ్మడి జిల్లాలోని 227 మద్యం దుకాణాలకు కొత్త లైసెన్స్‌ దారులు ఎవరో నేడు తేలనుంది. మొత్తం 5,536 మంది టెండర్లు దాఖలు చేయగా, వారిలో 227 మందిని లక్కీడిప్‌ ద్వారా ఎంపిక చేయనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఆయా కలెక్టరేట్లలో లక్కీడిప్‌ నిర్వహించేందుకు ఎక్సైజ్‌ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల లక్కీడిప్‌ను మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో నిర్వహిస్తారు.