News February 9, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.3,62,107 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.2,18,521, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,15,550, అన్నదానం రూ.28,036 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
Similar News
News November 21, 2025
మేడారం జాతరకు రండి.. రాష్ట్రపతిని ఆహ్వానించిన సీతక్క

మేడారం మహా జాతరకు హాజరుకావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్ర మంత్రి సీతక్క ఆహ్వానించారు. HYD బొల్లారంలో జరిగిన భారతీయ కళా మహోత్సవ్ -2025 కార్యక్రమంలో ఈమేరకు రాష్ట్రపతికి తెలంగాణ సమాజం తరఫున ఆహ్వానం పలికారు. జాతరలో పాల్గొంటే ఆదివాసీ గిరిజనులకు ప్రోత్సాహకంగా ఉంటుందన్నారు. ఒడిశాకు చెందిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, త్రిపురకు చెందిన తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు ఆదివాసీ మూలాలు ఉన్నాయన్నారు.
News November 21, 2025
మరికొన్ని గంటల్లో భారీ వర్షం

AP: బంగాళాఖాతంలో రేపు <<18351099>>అల్పపీడనం<<>> ఏర్పడనున్న నేపథ్యంలో అర్ధరాత్రి నుంచి రేపు ఉ.9 గంటల వరకు తిరుపతి, నెల్లూరులో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. రేపు మధ్యాహ్నానికి చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాలకూ వర్షాలు విస్తరించే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా నిన్న అర్ధరాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వర్షం దంచికొట్టిన విషయం తెలిసిందే.
News November 21, 2025
కష్టపడిన ప్రతీ ఒక్కరికి అవార్డు అంకితం: జనగామ కలెక్టర్

జల సంజయ్ జన భాగీదారి-1.0 కార్యక్రమంలో భాగంగా జాతీయ స్థాయిలో జనగామ జిల్లాకి అవార్డు వచ్చిన సందర్భంగా క్షేత్రస్థాయిలో కృషి చేసిన వివిధ శాఖల అధికారులకు గురువారం కలెక్టర్ అవార్డు ప్రదానం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమష్టిగా కృషి చేస్తేనే కేంద్ర, రాష్ట్ర స్థాయిలో పలు అంశాల్లో జిల్లాకి అవార్డులు వచ్చాయన్నారు. కష్టపడిన ప్రతీ ఒక్కరికి అవార్డు అంకితమన్నారు.


