News February 23, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.2,64,158 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,17,832, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.89,820 అన్నదానం రూ.56,506 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
Similar News
News September 19, 2025
నెల్లూరు: రష్యాలో శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

రష్యాలో నైపుణ్యాభివృద్ధిపై శిక్షణకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అధికారి అబ్దుల్ కయ్యం ఓ ప్రకటనలో తెలిపారు. ఆరు నెలల పాటు శిక్షణ అందిస్తారని, భోజన వసతితో పాటు స్కాలర్షిప్ అందజేస్తామన్నారు. 18 నుంచి 20 ఏళ్ల వయస్సు కలిగి 75% ఇంగ్లీషులో మార్కులు సాధించిన అభ్యర్థులు ఈనెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News September 19, 2025
విజయవాడ: క్షేత్రస్థాయిలో కలెక్టర్ పర్యటన

దసరా మహోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాల ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా శుక్రవారం ఆయన క్షేత్రస్థాయిలో కాలినడకన పర్యటించి పరిశీలించారు. ఈ ఏడాది భక్తులకు మధురానుభూతులను మిగిల్చేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.
News September 19, 2025
NZB: SC, ST కోర్టు PPగా దయాకర్ గౌడ్

నిజామాబాద్ జిల్లా SC, ST కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా R.దయాకర్ గౌడ్ నియమితులయ్యారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆయన జర్నలిస్ట్గా ప్రస్థానం మొదలు పెట్టారు. 2004 నుంచి కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. TPCC లీగల్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్గా ఉన్న ఆయన పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తూన్నారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ అగ్రనేతల సమన్వయంతో PPగా నియమితులయ్యారు.