News February 23, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.2,64,158 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,17,832, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.89,820 అన్నదానం రూ.56,506 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.

Similar News

News March 18, 2025

జగిత్యాల జిల్లాలో 40.4 హయ్యెస్ట్ టెంపరేచర్

image

జగిత్యాల జిల్లాలో మంగళవారం అత్యధికంగా రాయికల్ మండలం అల్లిపూర్, వెల్గటూర్, బుగ్గారం మండలం సిరికొండ, ఎండపల్లి మండలం మారేడుపల్లి, ధర్మపురి మండలం జైన, సారంగాపూర్ మండలాల్లో 40.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, జగిత్యాల, బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామంలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మల్లాపూర్ మండలం రాఘవపేట, వెల్గటూర్ మండలాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 18, 2025

ASF: హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి భరోసా

image

హెడ్ కానిస్టేబుల్ ఎండీ బషీరుద్దీన్ కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు రూ. 2.20 లక్షల చెక్కును అందించారు. బషీరుద్దీన్ ఇస్గాం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుూ అనారోగ్యంతో మృతి చెందినట్లు ఎస్పీ పేర్కొన్నారు. అనంతరం వారి కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్య వచ్చిన తమకు తెలుపాలని అండగా ఉంటామని మనోధైర్యాన్ని ఇచ్చారు.

News March 18, 2025

అమలాపురం: ఏటిగట్ల నిర్మాణం, బలోపేతానికి చర్యలు

image

కోనసీమ జిల్లా సెంట్రల్ డెల్టాలో భౌగోళిక పరిస్థితులు భూసారాలు స్థితిగతులు దృష్టిలో ఉంచుకొని రహదారుల నిర్మాణం, ఏటిగట్ల బలోపేతానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఆయన మంగళవారం అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద వివిధ శాఖల ఇంజినీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని రహదారులు, కాలువలు, ఏటిగట్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై వారితో చర్చించారు.

error: Content is protected !!