News March 24, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అదివారం రూ.2,97,110 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,74,546 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,04,900, అన్నదానానికి రూ.17,664 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
Similar News
News November 21, 2025
రిజర్వేషన్ల ఖరారుకు మంత్రివర్గం ఆమోదం.. రేపే జీవో

TG: గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ రేపు GO ఇవ్వనుంది. రిజర్వేషన్లు 50% మించకుండా కొత్త రిజర్వేషన్లను సిఫార్సు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన <<18332519>>నివేదికను<<>> రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రులకు ఫైలు పంపించి ఆమోదిస్తున్నట్లు సంతకాలు తీసుకున్నారు. దీంతో రిజర్వేషన్లపై రేపు జీవో రానుంది. అనంతరం ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది.
News November 21, 2025
హనుమకొండ: తెలంగాణ గోల్డ్ కప్ టీ-20 టోర్నమెంట్కు సెలక్షన్స్

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ గోల్డ్ కప్ 2025 T20 టోర్నమెంట్ కోసం జిల్లాలో క్రికెట్ జట్టు ఎంపికలు జరుగుతున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి తెలిపారు. 23న వరంగల్ జిల్లా వారికి ఓ-సిటీ గ్రౌండ్స్లో, హనుమకొండ జిల్లా వారికి JNS స్టేడియంలో సెలక్షన్ ఉంటుందని, క్రీడాకారులు తప్పక హాజరుకావాలని వారు కోరారు.
News November 21, 2025
రానున్న ఐదు రోజులు భద్రాద్రి జిల్లాకు అతి తేలిక పాటి వర్షాలు

రానున్న ఐదు రోజులు భద్రాద్రి జిల్లాలో అతి తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణ హెచ్చరికలు ఏమీ లేవని చెప్పారు. గత కొద్ది రోజులుగా పొడి వాతావరణ ఉండడంతో రైతులు పత్తి పంటను సేకరించుకున్నారు. తిరిగి తేలికపాటి వర్షాలు ప్రారంభం కావడంతో పత్తి, వరి రైతులు నష్టపోయే అవకాశం ఉంది.


