News March 27, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.1,33,830 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.66,398 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.56,320, అన్నదానానికి రూ.11,112 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

Similar News

News November 20, 2025

ఆరేళ్ల వయసుకే NGO స్థాపించి..

image

మణిపూర్‌కు చెందిన లిసిప్రియా కంగుజాం 2011లో జన్మించింది. ఆరేళ్ళ వయసులో చైల్డ్‌ మూవ్‌మెంట్‌ అనే సంస్థను స్థాపించి, క్లైమేట్‌ చేంజ్‌‌పై పోరాటం మొదలుపెట్టింది. లిసిప్రియా 2019లో యునైటెడ్‌ నేషన్స్‌ క్లైమేట్‌ చేంజ్‌ కాన్ఫరెన్స్‌‌లో మాట్లాడి అందర్నీ ఆకర్షించింది. ఆమె పోరాటానికి గుర్తింపుగా 2019లో డాక్టర్‌ APJ అబ్దుల్‌ కలాం చిల్డ్రన్స్‌ అవార్డ్, 2020లో గ్లోబల్‌ చైల్డ్‌ ప్రొడిజీ అవార్డ్‌లు అందుకుంది.

News November 20, 2025

GHMC బర్త్, డెత్ సర్టిఫికెట్లు వాట్సాప్‌లోనే

image

మీసేవ వాట్సాప్ ద్వారా GHMC పరిధిలోని 30 సర్కిళ్లలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల వివరాలు అందుబాటులో ఉన్నట్లు ఉప్పల్ మీసేవ కేంద్ర అధికారులు తెలిపారు. డెత్ సర్టిఫికెట్లకు సంబంధించి 2025 జూన్ రెండో తేదీ వరకు మరణించిన వారి వివరాలు మాత్రమే ఇందులో చూపిస్తున్నట్లుగా వినియోగదారులు తెలిపారు. ప్రజలు 80969 58096 నంబర్‌ సర్వీస్‌ను వాట్సాప్ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News November 20, 2025

TTD అధికారులకు సవాలే..!

image

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు జరగనుంది. గత దర్శనాల సమయంలో తొక్కిసలాట జరిగి పలువురు చనిపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని టికెట్ల జారీపై టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముందు 3రోజులు ఆన్‌లైన్ టోకెన్లు ఉన్నవారినే అనుమతించనుంది. తర్వాత 7రోజులు ఎవరైనా వెళ్లవచ్చు. ఇవేమీ తెలియకుండా కొండకు భారీగా వచ్చే భక్తులను అదుపు చేయడం TTD అధికారులకు పెద్ద సవాల్‌గా మారనుంది.