News March 28, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.1,63,699 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాల టికెట్ల అమ్మకం ద్వారా రూ.1,08,012, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.44,880, అన్నదానానికి రూ.10,807 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
Similar News
News March 1, 2026
ములుగు: CG మావోయిస్టుల డంప్ స్వాధీనం

ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లాలో పోలీసులకు భారీ విజయంలభించింది. నక్సలైట్లు రెండు వేర్వేరు ప్రదేశాల్లో దాచిన డంప్లపై శనివారం దాడులు నిర్వహించి రూ.46,31,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. రెండో డంప్లో భారీ ఆయుధాలు, కార్ట్రిడ్జ్లు, ఎలక్ట్రానిక్ సామగ్రి పట్టుబడ్డాయి. ఇప్పటివరకు భద్రతా దళాలు మొత్తం రూ.1.08 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
News March 1, 2026
వికారాబాద్ జిల్లాలో పెరిగిన యాసంగి సాగు

జిల్లాలో యాసంగి సాగు గణనీయంగా పెరిగింది. జిల్లాలో సుమారుగా 3,34,627 మంది రైతులు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా అత్యధికంగా రైతులు వరి పంటను పండిస్తున్నారు. జిల్లాలో ఇదివరకు సాధారణ సాగు 75,838 ఎకరాల్లో ఉండేది. ప్రస్తుతం 93,116 ఎకరాలర పెరిగింది. జిల్లాలో అన్ని పంటలు కలుపుకుని ప్రస్తుతం 1,45,241 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. దీన్నిబట్టి జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని చెప్పొచ్చు.
News March 1, 2026
శ్రీలంక కోచ్ పదవికి జయసూర్య రాజీనామా

తాను శ్రీలంక కోచ్ పదవి నుంచి దిగిపోతున్నట్లు సనత్ జయసూర్య ప్రకటించారు. T20 WCలో శ్రీలంక సూపర్-8లోనే ఇంటిదారి పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డు కొత్త కోచ్ అన్వేషణ మొదలుపెట్టింది. 2024లో జయసూర్య కోచ్ బాధ్యతలు చేపట్టారు. జూన్ 2026 వరకు కాంట్రాక్ట్ ఉన్నప్పటికీ మధ్యలోనే రాజీనామా చేశారు. ఇతడి హయాంలో శ్రీలంక 76 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడగా 36 మ్యాచుల్లో గెలిచింది.


