News March 29, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.1,63,699 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,08,012, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.44,880, అన్నదానానికి రూ.10,807 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.

Similar News

News December 4, 2025

‘అఖండ-2’ మూవీ.. ఫ్యాన్స్‌కు బిగ్ షాక్

image

అఖండ2 ప్రీమియర్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న బాలయ్య ఫ్యాన్స్‌కు డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ షాకిచ్చింది. సాంకేతిక కారణాలతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాలో ప్రీమియర్స్ ఉండవని 14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రకటించింది. ఓవర్సీస్‌లో మాత్రం యథావిధిగా ప్రీమియర్స్ ఉంటాయంది. ఇవాళ రాత్రి గం.8 నుంచి షోలు మొదలవుతాయని ప్రకటన వచ్చినా టికెట్స్‌పై సమాచారం లేక ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

News December 4, 2025

ఏలూరు: భర్తను బెదిరించబోయి.. ప్రాణాలు కోల్పొయింది

image

భర్త మద్యం మానేయాలని బెదిరించే క్రమంలో పురుగుల మందు తాగి మహిళ మృతి చెందిన ఘటన అడవికొలనులో చోటుచేసుకుంది. నిడమర్రు ఎస్ఐ రమేష్ కథనం ప్రకారం… గ్రామానికి చెందిన చిన్నిపిల్లి లక్ష్మి.. మద్యానికి బానిసైన తన భర్తను తాగుడు మాన్పించాలని గురువారం బెదిరించేందుకు, సోడా సీసాలో ఉన్న పురుగుల మందు తాగింది. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింనట్లు ఎస్ఐ వెల్లడించారు.

News December 4, 2025

కామారెడ్డి: చిత్తడి నేలల సంరక్షణకు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

కామారెడ్డి జిల్లాలోని చిత్తడి నేలలను గుర్తించడం, సంరక్షణ చర్యలపై గురువారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన ఇంటర్‌ డిపార్ట్‌మెంట్ అధికారుల సమావేశం జరిగింది. కలెక్టర్ ఆదేశాల మేరకు, సహజ, కృత్రిమ చెరువులు, కుంటలు వంటి చిత్తడి నేలలను ప్రమాణాల ప్రకారం గుర్తించాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ, అరణ్య, నీటిపారుదల, ఫిషరీస్ శాఖల సంయుక్త బృందం ఫీల్డ్ సర్వే త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు.