News March 31, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి నిత్య ఆదాయం.. ఎంతంటే..?

image

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అదివారం రూ.2,22,450 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు, టికెట్లు అమ్మకం ద్వారా రూ.91,300, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,06,250, అన్నదానం ద్వారా రూ.24,900లు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఓ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.

Similar News

News December 5, 2025

HYD: ఇదేం పునర్విభజన.. మేం ఉండలేం బాబోయ్!

image

మా ప్రాంతాలను గ్రేటర్‌లో కలిపితే మాకు అనుకూలంగా ఉండాలి కాని.. ఎక్కడో దూరంగా ఉన్న సర్కిళ్లలో కలిపితే ఎలా అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలీనంలో భాగంగా బడంగ్‌పేట, తుర్కయాంజల్, ఆదిభట్ల ప్రాంతాలు చార్మినార్ జోన్ కలిశాయి. అయితే ఆయా ప్రాంతాల వారు మాత్రం.. మేము ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఉంటామని చెబుతున్నారు. అలాగే పోచారం, బోడుప్పల్, పీర్జాదిగూడ ప్రాంత వాసులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.

News December 5, 2025

భగవంతుడిపై నమ్మకం ఎందుకు ఉంచాలి?

image

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః|
అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్||
దేవుడు మనలోనే అంతరాత్మగా ఉంటాడు. ధనుస్సు ధరించి పరాక్రమంతో ధైర్యాన్నిస్తాడు. ప్రజ్ఞావంతుడు, ఉన్నత క్రమశిక్షణ గల ఆయన అన్ని విషయాలకు అతీతంగా ఉంటాడు. ఎవరూ భయపెట్టలేని విశ్వాసపాత్రుడు మన కార్యాలను నెరవేరుస్తూ, సకల ఆత్మలకు మూలమై ఉంటాడు. మనం ఆ పరమాత్మను గుర్తించి, విశ్వాసం ఉంచి ధైర్యంగా జీవించాలి. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News December 5, 2025

KNR: భారీ ఆదాయం.. అయినా సొంత భవనాల్లేవ్..!

image

అద్దె భవనాలు, అరకొర వసతులతో రవాణా శాఖ అవస్థలు పడుతోంది. ఉమ్మడి కరీంనగర్ నుంచి ఏడాదికి రూ.400 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరుతోంది. అయినా KNR DTO ఆఫీస్ మినహా SRCL, PDPL, JGTL, కోరుట్ల, రామగుండం, HZB కార్యాలయాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. దీంతో ట్రాకులు లేక గుంతల రోడ్లపైనే డ్రైవింగ్ టెస్టులు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఇప్పటికైనా ప్రభుత్వం సొంత భవనాలు నిర్మించి సరైన వసతులు కల్పించాలి.