News March 31, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి నిత్య ఆదాయం.. ఎంతంటే..?

image

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అదివారం రూ.2,22,450 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు, టికెట్లు అమ్మకం ద్వారా రూ.91,300, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,06,250, అన్నదానం ద్వారా రూ.24,900లు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఓ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.

Similar News

News February 28, 2026

సంగారెడ్డి: జాతీయ చేనేత అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

సంగారెడ్డి జిల్లాలో జాతీయ చేనేత అవార్డులకు అర్హులైన వారు మార్చి 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని చేనేత శాఖ సహాయ సంచాలకులు వెంకటరావు తెలిపారు. దరఖాస్తుదారులు తాము స్వయంగా మగ్గంపై రూపొందించిన కొత్త డిజైన్లను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గతంలో ఎక్కడా లేని వినూత్న డిజైన్లకు ప్రాధాన్యత ఉంటుందని, వివరాలకు స్థానిక చేనేత కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు.

News February 28, 2026

మెదక్: 9 నెలలు.. రూ.4,611 కోట్ల రుణాలు

image

మెదక్ జిల్లాలో గత 9 నెలల్లో వివిధ రంగాలకు రూ.4,611 కోట్ల రుణాలను పంపిణీ చేసి, వార్షిక లక్ష్యంలో 67.32 శాతం పూర్తి చేశామని అడిషనల్ కలెక్టర్ నగేష్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో మాట్లాడారు. రైతులకు, మహిళా సంఘాలకు రుణాల పంపిణీలో పెద్దపీట వేశామన్నారు. బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్న రుణ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News February 28, 2026

నేడు కాళోజీ కళాక్షేత్రంలో అంతరిక్ష ప్రయోగాలపై సెమినార్

image

అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం మ.2:30 నుంచి 4 వరకు HNK కాళోజీ కళాక్షేత్రంలో సెమినార్ నిర్వహించనున్నారు. అంతరిక్ష ప్రయోగాలపై ప్రముఖ వక్తలు విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. పరిమిత సంఖ్యలోనే ప్రవేశం ఉంటుందని అధికారులు తెలిపారు. అనంతరం భద్రకాళి బండ్ వద్ద రుద్రమ రాకెట్‌ను ఆవిష్కరించనున్నారు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.