News April 2, 2024
ధర్మవరంలో మార్పు కోసం వస్తున్నా: సత్యకుమార్

ధర్మవరంలో అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు అంతం చేయడానికి ఈ నెల 4న ప్రజల ముందుకు వస్తున్నట్లు కూటమి అభ్యర్థి సత్యకుమార్ తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు అనంతపురం నుంచి ర్యాలీగా బయల్దేరతామన్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ విడుదల చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ధర్మవరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటానని, ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని సత్యకుమార్ కోరారు.
Similar News
News October 19, 2025
యాడికి: మహిళపై అత్యాచార యత్నం.. 11 మందిపై కేసు

యాడికి మండలానికి చెందిన మహిళపై ఈనెల 4న అదే మండలానికి చెందిన విశ్వనాథ్ ఆత్యాచార యత్నం చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. 8న విశ్వనాథ్ తన సోదరులు, బంధువులతో బాధితురాలి ఇంటిపై దాడి చేసినట్లు ఆరోపించారు. దాడిలో బాధితురాలి భర్త నారాయణస్వామి, కొడుకు నవీన్ తీవ్రంగా గాయపడ్డారని చెప్పింది. ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేని, శనివారం డీఐజీని ఆశ్రయించడంతో పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేశారన్నారు.
News October 19, 2025
యాడికి: 11 మందిపై కేసు నమోదు

యాడికి మండలానికి చెందిన మహిళపై ఈనెల 4న అదే మండలానికి చెందిన విశ్వనాథ్ బలాత్కారం చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. 8న విశ్వనాథ్ తన సోదరులు, బంధువులతో బాధితురాలి ఇంటిపై దాడి చేసినట్లు ఆరోపించింది. దాడిలో బాధితురాలి భర్త నారాయణస్వామి, కొడుకు నవీన్ తీవ్రంగా గాయపడ్డారని చెప్పింది. ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేని, బాధితులు శనివారం డీఐజీని ఆశ్రయించడంతో పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేశారన్నారు.
News October 18, 2025
2 నియోజకవర్గాలలో అరాచక పాలన: తోపుదుర్తి

రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాలలో అరాచక పాలన జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించి మాట్లాడారు. MLA పరిటాల సునీత పేదల ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వానికి లేఖ రాసి 50 వేల ఇళ్ల నిర్మాణాలు ఆపారన్నారు. MLA సునీత, పరిటాల శ్రీరామ్ చేనేతల నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు.