News April 7, 2025
ధర్మవరంలో రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్

ధర్మవరం ప్రభుత్వ బాలుర క్రీడా మైదానంలో ఈనెల 6 నుంచి 9 వరకు 15వ ఏపీ స్టేట్ ఛాంపియన్షిప్ హాకీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు ఈ కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ హాకీ పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా 22 టీంలు, 440 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Similar News
News December 13, 2025
పుష్ప-2 రికార్డు బ్రేక్ చేసిన ‘ధురంధర్’

రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. రెండో శుక్రవారం ₹34.70 కోట్ల కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో హిందీ పుష్ప-2(₹27.50Cr) రికార్డును బద్దలు కొట్టింది. ఆ తర్వాతి స్థానాల్లో ఛావా(₹24.30Cr), యానిమల్(₹23.53Cr), గదర్-2(₹20.50Cr), హిందీ బాహుబలి-2(₹19.75Cr) ఉన్నాయి. ఓవరాల్గా ధురంధర్ మూవీ ₹300+Cr <<18544001>>కలెక్షన్లు<<>> సాధించినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది.
News December 13, 2025
రూ.3600 కోట్లతో హరియాణా క్లీన్ ఎయిర్ ప్లాన్!

గాలి కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించేందుకు హరియాణా ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్తో MoU కుదుర్చుకుంది. రూ.3,600 కోట్లతో ‘హరియాణా క్లీన్ ఎయిర్ ప్రాజెక్ట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్’ను ప్రారంభించింది. ఐదేళ్లలో ఢిల్లీ-ఎన్సీఆర్లో (National Capital Region) గాలి నాణ్యత మెరుగుపరచడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. 500 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, 50,000 ఈ-ఆటోలకు ప్రోత్సాహకాలు అందించడం వంటివి ప్రతిపాదనలో ఉన్నాయి.
News December 13, 2025
పెద్దపల్లి జోన్లో సెక్షన్ 163 BNSS అమలు: సీపీ

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి జోన్లోని అంతర్గాం, పాలకుర్తి, జూలపల్లి, ధర్మారం మండలాలలో సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శనివారం ప్రకటించారు. ఎన్నికలు ప్రశాంతంగా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిర్వహించేందుకు ఈ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని హెచ్చరించారు.


