News April 7, 2025

ధర్మవరంలో రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్ 

image

ధర్మవరం ప్రభుత్వ బాలుర క్రీడా మైదానంలో ఈనెల 6 నుంచి 9 వరకు 15వ ఏపీ స్టేట్ ఛాంపియన్షిప్ హాకీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు ఈ కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ హాకీ పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా 22 టీంలు, 440 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

Similar News

News December 9, 2025

మెదక్ : సభలు, ర్యాలీలపై నిషేధం: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ప్రచారం 9 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పోలింగ్‌కు 44 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ అమలులోకి రానుంది. ఈ సమయంలో సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ప్రచారాలు నిషేధం. ఇతర ప్రాంతాల వారు పంచాయతీ పరిధిలో ఉండరాదు. ఉల్లంఘనలు గమనిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.

News December 9, 2025

గద్వాల: రూ.50 వేలకు మించితే పత్రాలు తప్పనిసరి: ఎస్పీ

image

గద్వాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా రూ.50 వేలకు మించి నగదు తరలించేవారు తప్పనిసరిగా సంబంధిత పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. లేనిపక్షంలో ఆ నగదును సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈనెల 11న ఎన్నికలు జరిగే గద్వాల, ధరూర్, కేటీదొడ్డి, గట్టు మండలాల్లో ఫలితాలు ప్రకటించే వరకు సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ (BNSS) యాక్ట్ అమల్లో ఉంటుందన్నారు.

News December 9, 2025

గ్లోబల్ సమ్మిట్: టెక్నాలజీ గుప్పిట్లో ‘ప్రగతి’ లక్ష్యాలు!

image

TG గ్లోబల్ సమ్మిట్‌లో ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (SDGs) సంచలనం సృష్టించాయి. ఫ్యూచరిస్టిక్ డోమ్‌లో ఈ 17 లక్ష్యాలను అద్భుతంగా ప్రదర్శించడం రాష్ట్ర ప్రభుత్వ ‘విజన్ 2047’కు అద్దం పట్టింది. వృద్ధి, పర్యావరణ పరిరక్షణ ఏకకాలంలో సాగాలనే స్పష్టమైన సందేశాన్నిస్తూ, సామాజిక న్యాయం, ఆర్థికాభివృద్ధిని ముడిపెట్టే ఈ ప్రదర్శన సమ్మిట్‌కు వచ్చిన ప్రపంచ దేశాల ప్రతినిధులను ఆకర్షించింది.