News April 24, 2024
ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న సాయికుమార్

ధర్మవరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ నామినేషన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో సినీనటుడు, బీజేపీ నాయకుడు సాయికుమార్ పాల్గొన్నారు. నేడు సత్యకుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పట్టణంలోని శివానగర్ శివాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు కూటమి పార్టీల కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 25, 2025
శిల్పారామంలో జనవరి 1న సాంస్కృతిక కార్యక్రమాలు

అనంతపురం శిల్పారామంలో నూతన సంవత్సరం సందర్భంగా 2026 జనవరి 1న సాయంత్రం 5గంటల నుంచి 8 వరకు ప్రముఖ కళాకారులచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం పరిపాలన అధికారి పి.శివ ప్రసాద్ రెడ్డి గురువారం వివరాలు వెల్లడించారు. సంస్కృతీ సంప్రదాయాల సమాహారం శిల్పారామం అన్నారు. అనంత ప్రజల కోసం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు.
News December 25, 2025
తాడిపత్రి: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

తాడిపత్రి మండలంలో రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని చల్లవారిపల్లె సమీపంలో రైల్వే పట్టాలపై మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు.
News December 25, 2025
అనంత జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధి ఈయనే.!

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బొమ్మనహల్ దర్గా హోన్నూరు గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు హెచ్.ఆనంద్ను జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధిగా నియమించారు. తాను పార్టీకి, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేస్తానని తెలిపారు. ఈ పదవిని ఇచ్చిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు కృతజ్ఞతలు తెలిపారు.


