News December 29, 2024

ధర్మవరం నుంచి శబరిమలకు సైకిల్ యాత్ర

image

అయ్యప్ప స్వాములు ధర్మవరం నుంచి శబరిమలకు సైకిల్ యాత్ర చేపడుతున్నారు. పట్టణంలోని చెరువు కట్ట వద్ద ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి భజన మందిరం గురుస్వామి విజయ్ కుమార్ శిష్యులు 18 మంది సైకిల్‌పై అయ్యప్ప సన్నిధికి వెళ్తుండగా శనివారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం 5 గంటల యాత్ర ప్రారంభమవుతుందని గురుస్వామి తెలిపారు. సుమారు 788 కి.మీ ప్రయాణించి వారు శబరిమల చేరుకుంటారు.

Similar News

News December 8, 2025

అనంత: అనాధ పిల్లలకు హెల్త్ కార్డుల పంపిణీ

image

అనాధ పిల్లల కోసం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం జిల్లాలోని అనాధ పిల్లలకు హెల్త్ కార్డులను తయారు చేయించింది. అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఈ కార్డులను పంపిణీ చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఈ సేవను అందిస్తున్న సంగతి తెలిసిందే.

News December 8, 2025

అనంత: ఈనెల 10లోపు టెట్.!

image

అనంతపురంలో ఈనెల 10 నుంచి 21 వరకు TET పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎంపిక చేసిన 7 కేంద్రాల్లో సెషన్ వన్ ఉదయం 9.30 నుంచి 12 వరకు, సెషన్-2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 షిఫ్టుల్లో జరుగుతాయని వెల్లడించారు.

News December 8, 2025

అనంతపురంలో నేడు ప్రజా వేదిక: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తామని కలెక్టర్ ఆనంద్ ఆదివారం తెలిపారు. కాల్ సెంటర్ 1100ను అందరికీ అందుబాటులో ఉంచామన్నారు. అర్జీలు పరిష్కారం కాకపోయినా, అర్జీల పరిస్థితిని తెలుసుకోవాలన్నా 1100కు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.