News January 27, 2025
ధర్మవరం: నూతన ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

ధర్మవరంలోని నూతన ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రాన్ని కలెక్టర్ చేతన్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ వ్యాధిగ్రస్తులకు అందుతున్న సేవలను, పంపిణీ చేస్తున్న మందులపై వారు అడిగి తెలుసుకున్నారు. తదుపరి ఈ నూతన ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే సేవల గూర్చి, సమస్యల గూర్చి సూపర్డెంట్ మాధవి ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఇప్పటిదాకా 21 మంది రోగులు డయాలసిస్ కోసం నమోదు చేసుకున్నారన్నారు.
Similar News
News December 13, 2025
నేడు కాణిపాకంలో నెల్లూరు కార్పొరేటర్ల ప్రమాణం.?

నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం ఘట్టం <<18549066>>వైకుంఠపాళి<<>>ని తలపిస్తోంది. అవిశ్వాసాన్ని నెగ్గించాలని TDP, అడ్డుకోవాలని YCP పావులు కదుపుతున్నాయి. పలువురు కార్పొరేటర్లు ‘<<18540168>>జంపింగ్ జపాంగ్<<>>’లా మారారు. ఎలాగైనా తమ కార్పొరేటర్లను కాపాడుకోవాలని TDP వారిని తిరుపతి తరలించిందట. మరికాసేపట్లో వారిని కాణిపాకం తరలించి ‘మేము TDPలోనే కొనసాగుతాం’ అని ప్రమాణం చేయించనున్నారట.
News December 13, 2025
ఖమ్మం: క్రిటికల్ పోలింగ్ కేంద్రాల పరిశీలించిన సీపీ

ఖమ్మం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు భారీ భద్రతా చర్యలు చేపడుతున్నట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. రూరల్ మండలంలోని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం 1,059 కేసుల్లో 7,129 మందిని బైండోవర్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సుమారు రెండు వేల మంది పోలీసు సిబ్బందితో భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
News December 13, 2025
MECON లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

మెటలర్జికల్& ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (<


