News January 27, 2025

ధర్మవరం: నూతన ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

image

ధర్మవరంలోని నూతన ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రాన్ని కలెక్టర్ చేతన్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ వ్యాధిగ్రస్తులకు అందుతున్న సేవలను, పంపిణీ చేస్తున్న మందులపై వారు అడిగి తెలుసుకున్నారు. తదుపరి ఈ నూతన ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే సేవల గూర్చి, సమస్యల గూర్చి సూపర్డెంట్ మాధవి ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఇప్పటిదాకా 21 మంది రోగులు డయాలసిస్ కోసం నమోదు చేసుకున్నారన్నారు.

Similar News

News November 21, 2025

iBOMMA రవి విచారణలో కీలక విషయాలు

image

iBOMMA రవి రెండో రోజు విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక సమాచారం సేకరించారు. తమిళ, హిందీ వెబ్‌సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసిన రవి క్రిప్టో ద్వారా పేమెంట్‌ చేసినట్లు గుర్తించారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌ను బెట్టింగ్ యాప్స్‌కు గేట్‌వేగా ఉపయోగించి వచ్చిన డబ్బులతో సినిమాలు కొనుగోలు చేసినట్లు కనుగొన్నారు. కరీబియన్ దీవుల్లో ఆఫీసు ఏర్పాటు చేసి, 20 మందితో కంటెంట్‌ను అప్‌లోడ్ చేయిస్తున్నట్లు తేల్చారు.

News November 21, 2025

iBOMMA రవి విచారణలో కీలక విషయాలు

image

iBOMMA రవి రెండో రోజు విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక సమాచారం సేకరించారు. తమిళ, హిందీ వెబ్‌సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసిన రవి క్రిప్టో ద్వారా పేమెంట్‌ చేసినట్లు గుర్తించారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌ను బెట్టింగ్ యాప్స్‌కు గేట్‌వేగా ఉపయోగించి వచ్చిన డబ్బులతో సినిమాలు కొనుగోలు చేసినట్లు కనుగొన్నారు. కరీబియన్ దీవుల్లో ఆఫీసు ఏర్పాటు చేసి, 20 మందితో కంటెంట్‌ను అప్‌లోడ్ చేయిస్తున్నట్లు తేల్చారు.

News November 21, 2025

ములుగు: ‘వయోవృద్ధులను కంటికి రెప్పలా కాపాడుకోవాలి’

image

వయోవృద్ధులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని ములుగు అదనపు కలెక్టర్ సంపత్ రావు అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగింది. కుటుంబ వ్యవస్థకు వయోవృద్ధులు మూలాధారమని ఆయన అన్నారు. వయోవృద్ధుల సంరక్షణ కోసం పటిష్ఠమైన చట్టాలు ఉన్నాయని, వారికి ఏవైనా సమస్యలు ఎదురైతే ఆర్డీఓకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.