News April 10, 2025
ధర్మవరం: ‘YS జగన్ క్షమాపణలు చెప్పాలి’

YS జగన్ చేసిన వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం సభ్యులు ఖండించారు. బుధవారం ధర్మవరంలోని ఎన్జీ హోమ్లో వారు మాట్లాడుతూ.. వేలాది మంది కార్యకర్తలతో రాజకీయ సభలను తలపించే విధంగా తరలి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు 1200 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టామన్నారు. మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై సభ్యసమాజం ఆలోచించాలన్నారు. ఈ వ్యాఖ్యల్ని జగన్ వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలన్నారు.
Similar News
News November 17, 2025
VZM: ఒకే వేదికపై రాజకీయ దిగ్గజాలు

విజయనగరం జిల్లా రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికను పంచుకున్నారు. జిల్లా కేంద్రంలో తూర్పుకాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వనభోజన మహోత్సవం జరిగింది. వనభోజనాలకి వైసీపీ, టీడీపీ, జనసేన ముఖ్య నాయకులు హాజరై ఒకే వేదికపై ఆశీనులయ్యారు. మంత్రి శ్రీనివాస్, చీపురుపల్లి ఎమ్మెల్యే కళావెంకటరావు, జనసేన నేత పడాల అరుణ, వైసీపీ నేతలు చిన్నశ్రీను, బొత్స ఝాన్సీ, తదితర నేతలు ఒకే వేదికపై కనిపించారు.
News November 17, 2025
RRCATలో 150 పోస్టులు

రాజా రామన్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (<
News November 17, 2025
Wow.. సిద్దిపేట నుంచి ఇండియా టీంకు

అక్బర్పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన పోతనక అభిలాష్ డాడ్జ్బాల్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. సిద్దిపేట నుంచి జిల్లా స్థాయికి, జాతీయ స్థాయికి ఎదిగిన అభిలాష్.. క్రికెట్తో సహా ఇతర క్రీడల్లోనూ చురుకైన పాత్ర పోషించేవాడు. దేశంలోని వివిధ రాష్ట్రాల క్రీడాకారులతో జరిగిన టెస్టులో మెరుగైన ప్రతిభ కనబరిచి జాతీయ జట్టులో సుస్థిర స్థానం సంపాదించిన అతడిని జిల్లా వాసులు అభినందిస్తున్నారు.


