News April 10, 2025
ధర్మవరం: ‘YS జగన్ క్షమాపణలు చెప్పాలి’

YS జగన్ చేసిన వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం సభ్యులు ఖండించారు. బుధవారం ధర్మవరంలోని ఎన్జీ హోమ్లో వారు మాట్లాడుతూ.. వేలాది మంది కార్యకర్తలతో రాజకీయ సభలను తలపించే విధంగా తరలి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు 1200 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టామన్నారు. మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై సభ్యసమాజం ఆలోచించాలన్నారు. ఈ వ్యాఖ్యల్ని జగన్ వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలన్నారు.
Similar News
News October 27, 2025
కరీంనగర్: మద్యం షాపుల లక్కీ డ్రా ప్రారంభం

కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం మద్యం షాపుల లక్కీ డ్రా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డ్రా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపునకు ఈ లక్కీ డ్రాను నిర్వహిస్తున్నారు.
News October 27, 2025
నామ జప ఫలితాన్ని తగ్గించే అపరాధాలు

భగవంతుని స్మరణలో భాగంగా ఆయన నామ జపం చేయడం గొప్ప పుణ్యకార్యం. అయితే శాస్త్రాల ప్రకారం.. ఆయన నామాన్ని జపించేటప్పుడు 10 రకాల అపరాధాలను చేయకూడదట. ఎంత జపం చేసినా ఈ అపరాధాలు ఉంటే ఆ నామ జపం పూర్తి ఫలితం ఎన్నటికీ లభించదు. నామ జపం అంటే.. కేవలం నామమును ఉచ్ఛరిస్తే సరిపోదు. దానిని భక్తితో, నియమబద్ధంగా చేయాలి. లేకపోతే ఆ కర్మ కేవలం శ్రమగా మిగిలిపోతుంది. ఆశించిన పుణ్యం, ఆధ్యాత్మిక లాభం సిద్ధించదు. <<-se>>#Bakthi<<>>
News October 27, 2025
శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్టులో ఉద్యోగాలు

కోల్కతాలోని శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్ట్ 4 ట్రెయినీ డాక్ పైలట్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి బీఎస్సీ నాటికల్ సైన్స్, సెకండ్ మేట్(FG)/డ్రెడ్జ్ మేట్ గ్రేడ్ 1 అర్హతగల అభ్యర్థులు నవంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అనంతరం దరఖాస్తు హార్డ్ కాపీని స్పీడ్ పోస్ట్ చేయాలి. రాతపరీక్ష/ప్రొఫిషియెన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://smp.smportkolkata.in/


